ఘట్కేసర్,ఆగస్టు: పోచారం మున్సిపాలిటీ 9వార్డు కౌన్సిలర్ మెట్టు బాల్రెడ్డి కుటుంబాన్ని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి మంగళవారం పరామర్శించారు. బాల్రెడ్డి తల్లి మెట్టు ముత్యాలమ్మ ఈనెల 2న మృతి చెందారు. విషయం తెలుసుకున్న మంత్రి మంగళవారం పోచారంలోని బాల్రెడ్డి ఇంటికి వెళ్ళి సానుభూతి తెలియజేశారు.
ఈ సందర్భంగా చైర్మన్ బి.కొండల్రెడ్డి, వైస్ చైర్మన్ రెడ్డ్యానాయక్,కమిషనర్ సురేశ్,కౌన్సిలర్లు హరిప్రసాద్రావు,రాజ్శేఖర్,సాయిరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు బుచ్చిరెడ్డి, జగన్మోహన్రెడ్డి, నర్సింహ్మ రెడ్డి, బాల్రెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.