మేడ్చల్, ఆగస్టు : మేడ్చల్ మున్సిపాలిటిలో ప్రజలకు ఉపయోగపడే విధంగా వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని మున్సిపల్ చైర్మన్ దీపికా నర్సింహరెడ్డి అన్నారు. మేడ్చల్ పట్టణంలోని పెద్ద చెరువు వద్ద కూరగాయల మార్కెట్, చేపల మార్కెట్ అభివృద్ది పనులను మున్సిపల్ చైర్మన్ దీపిక నర్సింహరెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మున్సిపాలిటిని అన్ని రకాలుగా అభివృద్ది చేయడానికి ప్రణాళిక బద్దంగా ముందుకు సాగుతున్నామని ఆమె తెలిపారు.
కూరగాయల మార్కెట్ నిర్మాణం చేపట్టి వసతులు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజల సహకారంతో ఆదర్శమున్సిపాలిటిగా తీర్చిద్దిద్దుతామన్నారు. కార్యక్రమంలో 17వ వార్డు కౌన్సిపల్ అర్చన సందీప్గౌడ్, నాయకులు నర్సింహరెడ్డి, సందీప్గౌడ్, శ్రీనివాస్గౌడ్, హరికృష్ణ, బాలనర్సింహ, వెంకటేశ్, మల్లేశ్, అకోక్, బీరప్ప తదితరులు పాల్గొన్నారు.