get together | పోచారం, మే4: దాదాపు పాతికేళ్ల తర్వాత తమ స్నేహితులు, చదువు చెప్పిన గురువులను చూసి పూర్వ విద్యార్థులు మురిసిపోయారు. చిన్ననాటి జ్ఞాపకాలను నెమరేసుకుంటూ సందడిగా గడిపారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఏదులాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలలో 1999-2000 సంవత్సరం (సిల్వర్జూబ్లీ)కార్యక్రమాన్ని ఆదివారం పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడలోని తులిప్స్ హోటల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తమ గురువులను సన్మానించి వారి ఆశీర్వాదాలను పొందారు.
ఈ సందర్భంగా ఉన్నత స్థానాలకు ఎదిగిన తమ పూర్వ విద్యార్థులను చూసి గురువులు ఆనందించారు. జీవితంలో ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆశీర్వదించారు. తమపై విద్యార్థుల ప్రేమాభినాలు ఎల్లప్పుడు ఉండాలని కోరుకున్నారు. విద్యార్ధినీవిద్యార్థులు ఒకరిని ఒకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. విద్యార్ధి దశలో గురువులతో మెలిగిన సందర్భాలను తెలియజేస్తూ ఆనందం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా సంజీవయ్య, యాదయ్య, వెంకుల్, నాగమణి, కల్పన, హన్మాన్దాస్, శ్రీనివాస్, ఇంద్ర, మంజులవాణిలను శాలువతో ఘనంగా సన్మానించారు.