మారేడ్పల్లి, ఆగస్టు 8 : మద్యానికి బానిసై ఓ వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
యాదవ్నగర్ మల్కాజ్ గిరి ప్రాంతానికి చెందిన ముద్దం కృష్ణ యాదవ్ (50) వృత్తి రీత్యా లేబర్గా పని చేస్తూ జీనవం కొనసాగిస్తున్నారు. గత కొంత కాలంగా కృష్ణ మద్యానికి బానిసైయ్యాడు. కాగా సోమవారం ఉదయం మల్కాజ్గిరి రైల్వే స్టేషన్ సి క్యాబిన్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ మార్చూరీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.