జీడిమెట్ల, ఏప్రిల్ 5 : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో అపదలో ఉన్న కుటుంబాలకు తాను ఎల్లప్పుడు అండగా ఉంటానని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ అన్నారు. సుభాష్నగర్కు చెందిన టీఆర్ఎస్ కార్యకర్త నాని ఇల్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంట్లో మంటలు చెలరేగి ఇంట్లోని సామగ్రి అంతా కాలిపోయింది. స్థానిక టీఆర్ఎస్ నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మంగళవారం బాధితుడు నాని ఇంటి వద్దకు వెళ్ళి రూ.50 వేలు ఆర్థిక సహయం అందించి కుటుంబ సభ్యులకు భరోసానిచ్చారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు తన వంతు సహయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సుభాష్నగర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు పోలె శ్రీకాంత్, టీఆర్ఎస్ నాయకులు అడపా శేషు, భద్రయ్య, ఇస్మాయిలు, విజయ్, పద్మజారెడ్డి, పుప్పాల భాస్కర్, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.