జీడిమెట్ల,ఏప్రిల్7 : ఇంట్లో నెలకొన్న సమస్యలతో మానసిక ఒత్తిడిని తట్టుకోలేక గృహిణి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం వెలుగులోకి వచ్చింది. సీఐ బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం..కుత్బుల్లాపూర్ అయోధ్యనగర్ ప్రాంతానికి చెందిన కోటగిరి శర్వాణి(33), విజయశంకరశాస్త్రి దంపతులకు కార్తీక్, వైష్ణవి, త్రిశల్ ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇటీవల భర్తకు రోడ్డు ప్రమాదం జరగడంతో శర్వాణికి ఇంట్లో పని ఎక్కువైంది.
దీంతో పని ఒత్తిడి తట్టుకోలేక పలుమార్లు తన తల్లితో తాను చనిపోవాలని నిర్ణయించుకున్నాని చెప్పడంతో మందలించింది. ఈ క్రమంలో గురువారం ఉదయం 9 గంటల ప్రాంతంలో వారు ఉంటున్న ఇంటి పెంట్హౌజ్కి వెళ్లి తన భర్తకు ఫోన్ చేసి తాను చనిపోవాలని నిర్ణయించుకున్నాని చెప్పడంతో పైకి వెళ్లి చూసే క్రమంలో రాడుకు ఉరి వేసుకొని విగతజీవిలా వేలాడుతూ దర్శనమిచ్చింది. మృతురాలి తల్లి నాగద్రక్షయాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.