కేపీహెచ్బీ కాలనీ, జూన్ 16 : కాలనీలు బస్తీలలో ప్రజలకు అందుబాటులో ఓపెన్ జిమ్లను సద్వినియోగం చేసుకుని ఆరోగ్యవంతులుగా జీవించాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. గురువారం కూకట్పల్లి డివిజన్ శాంతినగర్ చింతపట్ల వెంకటయ్య పార్కులో రూ.15 లక్షలతో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ను ఎమ్మెల్యే ప్రారంభించారు.
పార్కులో మొక్కలు నాటి నీళ్లు పోశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వం ఓపెన్ జిమ్లను ఏర్పాటు చేస్తుందన్నారు. బస్తీలలో నివసిస్తున్న ప్రజలు ప్రైవేట్ జిమ్లకు వెళ్లే అవసరం లేకుండా అన్ని వ్యాయామ పరికరాలతో కూడిన ఓపెన్ జిమ్లను అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. వీటిని ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు.
కాలనీలో ఖాళీ స్థలాలు, ఇంటిముందు మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు సంతోష్, కార్యదర్శి ప్రభాకర్, నియోజకవర్గం ఎస్సీసెల్ అధ్యక్షుడు బొట్టు విష్ణు, అనీల్, బస్తీ కమిటీ అధ్యక్షుడు పోచయ్య, శంకర్లింగం, మహేందర్ రెడ్డి, నరేందర్ రెడ్డి, నాగరాజు తదితరులున్నారు.