కుత్బుల్లాపూర్,ఆగస్టు: మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు కూకట్పల్లి జోనల్ పరిధిలోని కుత్బుల్లాపూర్, గాజులరామారం సర్కిళ్ల పరిధిలో భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులను నిధులు మంజూరు అయిన్నట్లు జోనల్ కమిషనర్ మమత శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు కుత్బుల్లాపూర్ సర్కిల్కు రూ.18.87 కోట్లు, గాజులరామారం సర్కిల్కు రూ.17.70 కోట్ల నిధులు మంజూరి అయ్యాయి.
మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్తో పాటు అధికారులు ఇచ్చిన ప్రతిపాదనల మేరకు నిధులు మంజూరు అయినట్లు ఆమె వెల్లడించారు. వెంటనే టెండర్ ప్రక్రియ పూర్తి చేసి సకాలంలో పనులు ప్రారంభించి డ్రైనేజీ నిర్మాణ పనులను చేపట్టనున్నట్లు వివరించారు.