చర్లపల్లి : నియోజకవర్గ పరిధిలోని కాలనీల సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించి పనులు చేపట్టనున్నట్లు ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. ఏఎస్రావునగర్ డివిజన్ భవానినగర్ సంక్షేమ సంఘం నాయకులు ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డిని కలిసి మంచినీటి సమస్యలు, పార్కు అభివృద్ధి, కమ్యూనీటి హాల్ నిర్మాణానికి చర్యలు తీసుకొవాలని వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో నెలకొన్న సమస్యలను దశలవారిగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ముఖ్యంగా భవానినగర్లో మంచినీటి సమస్యలు తలేత్తకుండా నూతన పైప్లైన్ నిర్మాణం పనులు చేపడతామని ఆయన తెలిపారు.
అదేవిధంగా కాలనీలో చిల్డ్రన్స్ పార్కు అభివృద్ధికి నిధులు కేటాయించడంతో పాటు కమ్యూనీటీ హాల్ నిర్మాణానికి నిధులు కేటాయించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ సంక్షేమ అధ్యక్ష, కార్యదర్శులు అంజిరెడ్డి, చిరంజీవి, రుక్కయ్య, శ్రీనివాస్గుప్తా, తారేశ్వర్, టీఆర్ఎస్ నాయకులు గడ్డం రవికుమార్, ముత్యంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.