వినాయక్నగర్, ఆగస్టు : శ్రావణ మాసం సందర్భంగా శివాలయాల్లో భక్తులు పూజలు నిర్వహించారు. సోమవారం అల్వాల్ సర్కిల్ పరిధిలో శ్రావణ మాసంలో శివాలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిగాయి. దినకర్నగర్లోని చంద్రమౌళీశ్వర ఆలయంలో భక్తులు కిటకిటలాడారు. కొరోనా నిబంధనలు పాటిస్తూ అర్చకులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు.