అల్లాపూర్,ఫిబ్రవరి14 : మోతీనగర్ అభివృద్ధికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటామని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. సోమవారం మూసాపేట్ డివిజన్ పరిధి పాండురంగానగర్ స్మశానవాటికలో రూ.50 లక్షల వ్యయంతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన, బిఎస్పి కాలనీలో రూ.50 లక్షల వ్యయంతో సీసీరోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే స్థానిక కార్పొరేటర్ మహేందర్ తో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..గత ఏడేళ్లుగా మోతీనగర్ లో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. పాండురంగానగర్ స్మశానవాటికలో సకల వసతులు కల్పించి మోడ్రన్ స్మశానటికగా అభివృద్ధి పరుస్తామన్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత అభివృద్ధి, సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసిందన్నారు .ప్రజా సమస్యలే ధ్యేయంగా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ నిమోజకవర్గ అభివృద్ధికి కృషిచేస్తున్నామని పేర్కొన్నారు.
కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్కుమార్, మాజీ కౌన్సిలర్ సీహెచ్ సత్యనారాయణ, బి.సి.సెల్ అధ్యక్షుడు నాగుల సత్యం,టీఆర్ఎస్ డివిజన్ అధక్షుడు అంబటి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి తిరుపతి, బిఎస్పి కాలనీ అధ్యక్షుడు చక్రపాణి, తదితరులు పాల్గొన్నారు.