పీర్జాదిగూడ, సెప్టెంబర్15 : సీఎం రిలీఫ్పండ్ నిరుపేదలకు వరంలాంటిదని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. పీర్జాదిగూడ నగరపాలకసంస్థ పరిధి 5వ డివిజన్ రాంనగర్ కాలనీకి చెందిన ఆర్ గోపాలకృష్ణ ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు.
ఈ మేరకు ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ.60వేల చెక్కును గురువారం మంత్రి మల్లారెడ్డి స్థానిక కార్పొరేటర్ బొడిగ స్వాతితో కలిసి లబ్ధిదారునికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కేసీఆర్ ప్రభుత్వం గతంలో కంటే ఎక్కువ మొత్తంలో సీఎంఆర్ఎఫ్ సహాయం అందజేస్తుందన్నారు.
నిరుపేదలకు ఆపత్కాలంలో సీఎంఆర్ఎఫ్ సంజీవని వలే పని చేస్తుందన్నారు. అర్హత కలిగిన ప్రతి నిరుపేద ముఖ్యమంత్రి సహాయ నిధిని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. క్యాక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.