కీసర, ఆగస్టు 11 : అర్హులైన నిరుపేదలందరికి ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. మేడ్చల్ జిల్లా కీసర మండలం గోధుమకుంట గ్రామానికి చెందిన సోమని లక్ష్మమ్మకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరైన సీఎం రూ.35వేల చెక్కును అందించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం రిలీఫ్ ఫండ్ కింద నిరుపేదలందరికి ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసి ఆదుకుంటుందన్నారు. దరఖాస్తు చేసుకొన్న లబ్ధిదారుడికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి అండగా ఉంటుందన్నారు.
తెలంగాణ ప్రభుత్వం పేదల పక్షపాతి అని, సీఎం కేసీఆర్ పేదల సంక్షేమం, అభివృద్ధి కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల నాయకులు వంగేటి పర్వత్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.