మేడ్చల్ కలెక్టరేట్, మే 18 : పేదల సంక్షేమం, అభివృద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని కార్మిక, ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు ఇందిరమ్మ కాలనీకి చెందిన నర్సింహాకు రూ.50వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును బుధవారం మంత్రి అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తు వారిని అర్థికంగా అభివృద్ధికి కృషి చేస్తారని అన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు వసుపతి రమేష్ గౌడ్, నాగాయిపల్లి సుజాత, నాగాయిపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.