చర్లపల్లి : చర్లపల్లి పారిశ్రామికవాడలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చర్లపల్లి పారిశ్రామికవాడ ఫేజ్-3 అధ్యక్షుడు మియ్యాపురం రమేశ్ పేర్కొన్నారు. తెలంగాణ ఉన్నత విద్య మండలి చైర్మన్గా నియమితులైన ప్రొఫెసర్ లింబాద్రిని మంగళవారం ఆయన కలిశారు. ఈ సందర్భంగా చర్లపల్లి పారిశ్రామికవేత్తల సంఘం ప్రతినిధులు, రెడ్ క్రాస్ సోసైటీ ప్రతినిధులు కలిసి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు, యూత్ రెడ్ క్రాస్లో యువత పాత్రపై ఆయనకు వివరించారు.
అనంతరం చర్లపల్లి పారిశ్రామికవాడలో ఆయన మాట్లాడుతూ పారిశ్రామికవాడలోని వివిధ పరిశ్రమలలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించే విధంగా త్వరలో జాబ్మేళాను నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అదేవిధంగా రెడ్ క్రాస్ సోసైటీ సేవలను విస్తరించేందుకు కృషి చేస్తున్నామని, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 8లక్షల మంది విద్యార్థులు యూత్ రెడ్ క్రాస్లో సభ్యత్వం తీసుకున్నారన్నారు.
త్వరలో గవర్నర్ తమిళసై సౌందరరాజన్ అదేశాల మేరకు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో పలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో చర్లపల్లి పారిశ్రామికవేత్తలు, రెడ్క్రాస్ సోసైటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.