మేడ్చల్ : నేరాల నియంత్రణకు ప్రతి కాలనీ, బస్తీలల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు అన్నారు. నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధి బాచుపల్లిలోని శ్రీసాయినగర్లోరూ, 5లక్షల వ్యవయంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా నేరాలు అదుపులోకి వస్తాయన్నారు.
నేరాలు జరిగిన చోట సీసీ కెమెరా ఫుటేజీలు ఉన్నట్లేతే నేరస్తులను త్వరగా గుర్తించేందుకు వీలుంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి ఏసీపీ చంద్రశేఖర్, బాచుపల్లి సీఐ నర్సింహరెడ్డి, నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ధన్రాజు, కార్పొరేటర్లు కాసాని శిరీష, కాసాని సుధాకర్ముదిరాజు, చిట్ల దివాకర్, బాలాజీనాయక్, టీఆర్ఎస్ నేతలు కాసాని వీరేశ్ముదిరాజు, చంద్రగిరి సతీష్, గజ్జెల మల్లికార్జున్ లు పాల్గొన్నారు.