మూసాపేట, ఆగస్టు : తలసేమియా బాధితుల కోసం కూకట్పల్లి పోలీస్స్టేషన్లో ఆగస్టు 10న రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు సీఐ నర్సింగ్రావు తెలిపారు. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలీస్స్టేషన్ ఆవరణలో జరిగే రక్తదాన శిబిరంలో యువత పెద్దఎత్తున పాల్గొని బాధితులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.