బాలానగర్, ఆగస్టు : రక్తదానం చేయడం.. ప్రాణదానం చేసినట్లు….ప్రాణదానం మహాదానం అని బాలానగర్ ఏసీపీ కె పురుషోత్తం అన్నారు. మంగళవారం బాలానగర్ పోలీస్ స్టేషన్లో సుల్తాన్బజార్లోని ప్రభుత్వ మెటర్నిటీ దావఖాన సౌజన్యంతో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని బాలానగర్ ఏసీపీ పురుషోత్తం, సీఐ ఎండీ వహీదుద్దీన్లు ప్రారంభించారు.
పీఎస్లో నిర్వహించిన రక్తదాన శిబిరంలో 70మంది రక్తదానం చేశారు. ఈ సందర్భంగా సుల్తాన్బజార్ ప్రభుత్వ మెటర్నిటీ దావఖాన ఆర్ఎంవో జయలక్ష్మి ఏసీపీ పురుషోత్తంకు మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయన్నారు.
ఒకరు రక్తదానం చేయడం వల్ల మరికొంతమందికి స్పూర్తి కలిగిస్తుంది, ఆస్పూర్తి మరో వందల మంది ప్రాణాలు నిలబెట్టిడానికి పనికొస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు ఖలీల్పాష, రాజేష్గౌడ్, సంగమేశ్వర్, ఏఎస్సై నర్సింహరెడ్డితోపాటు పీఎస్ సిబ్బంది, డాక్టర్లు తరుణ్, అఖిలేష్, స్టాఫ్నర్స్లు లావణ్యకుమారి, లలిత తర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.