కీసర, ఆగస్టు : గ్రామాల్లోని దళితవాడల్లో నెలకొన్న సమస్యలన్నింటిని త్వరితగతిన పరిష్కారిస్తామని కీసర ఎంపీడీవో పద్మావతి తెలిపారు. మండల పరిధి తిమ్మాయిపల్లిలో బుధవారం మండల అధికారుల బృందం పర్యటించింది. దళిత వాడల్లో పర్యటించి అక్కడ నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ హయాంలో దళితుల బస్తీలో నెలకొన్న సమస్యలను పరిష్కారించడానికి ప్రభుత్వం చక్కటి కార్యచరణ ప్రణాళికలను రూపొందించిందన్నారు.
అర్హులైన దళితులందరికి ప్రభుత్వం “దళితబంధు” పథకం కింద ఆర్థిక సహాయం అందించి వారి జీవితాల్లో భరోసా నింపుతుందన్నారు. దళితులకు ప్రభుత్వం అండగా ఉండి వారి ఉజ్వల భవిష్యత్కు చక్కటి పునాదులు వేస్తుందన్నారు. ఆ బస్తీలో ప్రజలకు కావాల్సిన మౌళిక వసతి సదుపాయాలైన సీసీ రోడ్డు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ వంటి సమస్యలను పరిష్కారిస్తామన్నారు. బస్తీలో నెలకొన్న సమస్యల పరిష్కారించేందుకు ప్రభుత్వ పరంగా ఎక్కువ నిధులను విడుదల చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీవో మంగతాయారు, సర్పంచ్ పిడిచుట్టి పెంటయ్య, ఎంపీటీసీ కందాడి ప్రమీలఅమరేందర్రెడ్డి, మండల ఎఈ శ్రీనివాస్రెడ్డి, ఆర్అండ్బీ ఎఈ స్వామి, పంచాయతీ కార్యదర్శి అమ్రీన్, ఉప సర్పంచ్ భాగ్యమ్మ, పంచాయతీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.