మొయినాబాద్, ఆగస్టు 15 : మొయినాబాద్ మండల పరిధదిలోని తోలుకట్టా గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు మంగళవారం ఎమ్మెల్యే కాలె యాదయ్య, సర్పంచ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరిలో తోలుకట్టా వన సంరక్షణ సమితి, విశ్వకర్మ మండల ప్రధాన కార్యదర్శి చిన్నయ్యస్వామి, మాజీ ఉపసర్పంచ్ చాంద్సుల్తానాతో పాటు కాంగ్రెస్ నాయకులు వడ్ల రాజుచారి, సన్నీకుమార్చారి, అమీర్గూడ పాండు, గౌండ్ల మల్లేశ్ తదితరులు ఉన్నారు. ఎమ్మెల్సీ కవిత వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోనికి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఎంపీపీ నక్షత్రం, జడ్పీటీసీ శ్రీకాంత్, ఉపసర్పంచ్ రవీందర్, మాజీ ఎంపీటీసీ రవీందర్, మండల కో ఆప్షన్ సభ్యుడు ఎండీ బిలాల్ పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని నాలుగు మున్సిపాలిటీల్లో మౌలిక వసతుల కల్పన కోసం ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఇందుకోసం ఇప్పటికే మంత్రి కేటీఆర్ నాలుగు మున్సిపాలిటీలకు రూ.45కోట్లను కేటాయించారని, త్వరలోనే నిధులు కూడా మంజూరు కానున్నాయని తెలిపారు. తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి ఇంజాపూర్లోని వివిధ కాలనీలకు చెందిన సుమారు 150 మంది ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం, ఆదిబట్ల, తుర్కయంజాల్, పెద్దఅంబర్పేట్ మున్సిపాలిటీలు ఇకనుంచి శరవేగంగా అభివృద్ధి చెందనున్నాయన్నారు.
కొత్తగా ఏర్పడుతున్న అన్ని కాలనీల్లో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడానికి పెద్దపీట వేస్తామన్నారు. ఇటీవల మంత్రి కేటీఆర్ ఇబ్రహీంపట్నంలో పర్యటించిన సందర్భంగా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.5కోట్లు, ఇబ్రహీంపట్నం పెద్దచెరువు సుందరీకరణకు రూ.9కోట్లు కేటాయించారని పేర్కొన్నారు. ఆదిబట్ల మున్సిపాలిటీలో మౌలిక వసతుల కల్పనకు రూ.5కోట్లు, తుర్కయాంజాల్ మున్సిపాలిటీకి రూ.15కోట్లు, పెద్దఅంబర్పేట్ మున్సిపాలిటీకి రూ.15కోట్లు కేటాయించారని, ఈ నిధులతో పనులు వేగం పుంజుకోనున్నాయని తెలిపారు. ఈ నెల 17 మంత్రి హరీశ్రావు ఆదిబట్ల, తుర్కయాంజాల్, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీల్లో పర్యటించనున్నారని చెప్పారు. ఇప్పటికే ఔటర్ లోపలి గ్రామాల్లో హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ ఆధ్వర్యంలో మిషన్ భగీరథ కింద పెద్దఎత్తున తాగునీరు అందిస్తున్నామన్నారు.
తుర్కయాంజాల్ మున్సిపాలిటీలోని కమ్మగూడలో రూ.8లక్షలతో ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకు ప్రారంభించనున్నారని, ఇంజాపూర్, తుర్కయాంజాల్ మధ్యలో ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న బ్రిడ్జి నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తున్న బీఆర్ఎస్ను ప్రజలంతా బలపర్చాల్సిన అవసరం ఉందన్నారు. పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని, తప్పుడు ప్రచారాలతో ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాలకు తగిన గుణపాఠం చెప్పాలని ఎమ్మెల్యే కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రాంరెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, కోఆప్షన్ సభ్యుడు నర్సింహారెడ్డి, కౌన్సిలర్లు శ్రీలత, రవీందర్రెడ్డి, కీర్తన, శేఖర్గౌడ్, మల్లేశ్, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.