మొయినాబాద్, అక్టోబర్ 7 : బంతి సాగుతో అధిక లాభాలు పొందవచ్చని ఉద్యానవన శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఏడాది పొడవునా సాగు చేసి సిరులు పండించవచ్చు. చీడ పీడల నుంచి పంటను కాపాడుకుంటే అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. వినాయక చవితి మొదలుకుని బతుకమ్మ, దసరా, దీపావళి, కార్తీకమాసం ప్రత్యేక పూజల కోసం బంతి పూలను విరివిగా ఉపయోగిస్తారు. బంతి సాగు తక్కువ కాలంలో, తక్కువ ఖర్చుతో పంట చేతికొస్తుంది. ఉగాది పండుగ చివరి వరకు బంతి పంట దిగుబడి వచ్చేలా ప్రణాళికాబద్ధంగా సాగు చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు.
సూచనలు, సలహాలు..
కత్తిరింపులు ఎప్పుడు చేయాలి..
పూల కోత..
సమగ్ర సస్యరక్షణ చర్యలు..
తక్కువ నీటితో మొక్కల సంరక్షణ..
ఈ పంటకు నీరు అంతగా అవసరం ఉండదు. వారానికి ఒక సారి నీటిని పెడితే సరిపోతుంది. నీటి యాజమాన్యానికి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నిర్వహిస్తే మరింత నీరు ఆదా అవుతుంది. మొక్కలు హైబ్రీడ్ రకాలు రావడంతో.. తెగులు, రోగాలు సోకే అవకాశం ఉంటుంది. ఆకు ముడుత పురుగు నివారణ కోసం ఉద్యానవనశాఖ అధికారుల సూచనల మేరకు క్రిమి సంహారక మందులు వాడాలి. సేంద్రియ పద్ధతులైన వేప నూనె పిచికారీ చేస్తే పురుగుల బెడదను తగ్గించవచ్చు. అలాగే మొక్కలకు యూరియా, డీఏపీ వంటి రసాయనిక ఎరువులతో పాటు వేప పిండిని వేస్తే మొక్క ఎదుగుతుంది. మొక్కలు నాటకముందు దుక్కిలోనే సేంద్రియ ఎరువులు వేస్తే రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించవచ్చు.
కాలానికి అనుగుణంగా దిగుబడి..
కాలానికి అనుగుణంగా బంతి పూల దిగుబడి వస్తుంది. వర్షాకాలంలో మొక్కలు త్వరగా పెరిగి , తర్వగా పూతకు వస్తాయి. శీతాకాలంలో పెరుగుదల కనిపించదు. అయినా త్వరగా పూతకు వస్తాయి. వేసవికి ముందు మొక్కల్లో పెరుగుదల కనిపిస్తుంది. పూల దిగుబడిలో నాణ్యత లోపిస్తుంది. ఏడాది పొడవునా బంతి సాగు చేయవచ్చు.
– ఎన్.రాగమ్మ, మండల వ్యవసాయ అధికారి, మొయినాబాద్