పరిగి, ఫిబ్రవరి 8: విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ మన ఊరు-మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీని ద్వారా సర్కారు బడుల్లో మౌలిక వసతులు కల్పించనుండటంతో వాటి రూపురేఖలు పూర్తిగా మారనున్నాయి. ఈ ఏడాది వికారాబాద్ జిల్లాలో మౌలిక వసతులను కల్పించేందు కు అధికారులు అధికంగా విద్యార్థులు ఉన్న 371 పాఠశాలలను ఎంపిక చేశారు. జిల్లాలో మొత్తం 1,058 పాఠశాలలున్నాయి. జిల్లా లో ప్రతి మండలాన్ని యూనిట్గా తీసుకుని పాఠశాలలను ఎంపిక
చేశారు. ఆయా మండలాల్లోని పాఠశాలల్లో అధికంగా విద్యార్థులు ఉన్న 35శాతం బడులను ఎంపిక చేయగా …త్వరలోనే ఆయా పాఠశాలల్లో ఏ, ఏ వసతుల కల్పనకు ఎంత మొత్తాన్ని వెచ్చించనున్నది స్పష్టం కానున్నది. ఇందుకు సంబంధించి ఉన్నతాధికారుల నుంచి ఒకటి, రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో వివరాలు అందనున్నాయి.
‘మన ఊరు-మన బడి’లో భాగంగా పాఠశాలల్లో 12 అంశాలపై ప్రత్యేకంగా దృష్టిని సారించనున్నారు. అందులో నీటి వసతితో కూ డిన మరుగుదొడ్లు, విద్యుత్ సౌకర్యం, తాగునీటి వసతి, విద్యార్థు లు, ఉపాధ్యాయులకు ఫర్నిచర్, పాఠశాలల భవనాలకు పెయింటింగ్, మైనర్, మేజర్ మరమ్మతులు, ప్రహరీల ఏర్పాటు, కిచెన్షె డ్ల నిర్మాణం, అవసరమైన చోట అదనపు తరగతి గదుల నిర్మాణం, ఉన్నత పాఠశాలల్లో డైనింగ్హాళ్ల నిర్మాణం, డిజిటల్ విద్య అమలుకు అవసరమైన వసతులను కూడా కల్పించనున్నారు. ఎస్ఐఎస్(స్కూల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్) యాప్ను రూపొందించి, ప్రతి పాఠశాలలోని వసతులకు సంబంధించిన ప్రతి గదిలోని నాలుగువైపుల గోడలు, రూఫ్, ఫ్లోరింగ్, తలుపులు ఇలా ఎనిమిది ఫొటోలు, మరుగుదొడ్లు, తాగునీటి వసతి, వంటగది, ప్రహరీ, ప్రధానోపాధ్యాయుడి కార్యాలయం, ఉన్నత పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, విద్యార్థుల సంఖ్య తదితర అంశాలకు సంబంధించిన ఫొటోలను ఆయా పాఠశాలల హెచ్ఎంలు ఎస్ఐఎస్ యాప్లో అప్లోడ్ చేశారు. ఆయా పాఠశాలల్లో వసతుల కల్పనకు సంబంధించి అధికారులు అంచనాలు తయారు చేసి నిధులను విడుదల చేయనున్నారు. ఎస్ఎంసీలు ఈ పనులను పర్యవేక్షించనున్నారు.
జిల్లాలోని ఆయా మండలాల వారీగా మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా మొదటి విడుత వసతుల కల్పనకు విద్యాశాఖ అధికారులు ఎంపిక చేసిన పాఠశాలలు ఇలా..
బంట్వారం మండలంలో 19 పాఠశాలలుండగా ఈసారి ఏడు స్కూళ్లు (930 మంది విద్యార్థులు), బషీరాబాద్లో 61 పాఠశాలలుండగా 21స్కూళ్లు,(3,726 మంది విద్యార్థులు), బొంరాస్పేట్లో 70 స్కూళ్లుండగా 25 బడులు (4,181 మంది విద్యార్థు లు), చౌడాపూర్లో 43 పాఠశాలల్లో 15 బడులు (2,542 మంది విద్యార్థులు), ధారూర్లో 55 పాఠశాలల్లో 19 (2,849 మంది విద్యార్థులు), దోమలో 70 పాఠశాలల్లో 25 (4,582 మంది విద్యార్థులు), దౌల్తాబాద్లో 67 పాఠశాలల్లో 23 (4251 మంది విద్యార్థులు), కొడంగల్లో 55 పాఠశాలల్లో 19 (4,174 మంది విద్యార్థులు), కోట్పల్లిలో 27 పాఠశాలల్లో 9 (1,349 మంది విద్యార్థులు), కులకచర్లలో 67 పాఠశాలల్లో 23 (3,438 మంది విద్యార్థులు), మర్పల్లిలో 50 పాఠశాలల్లో 18 (2,795 మంది విద్యార్థులు), మోమిన్పేట్లో 54 పాఠశాలల్లో 19 (2,499 మం ది విద్యార్థులు), నవాబుపేట్లో 42 పాఠశాలల్లో 15 (1,537 మంది విద్యార్థులు), పరిగిలో 65 పాఠశాలల్లో 23 (4,311 మంది విద్యార్థులు), పెద్దేముల్లో 59 పాఠశాలల్లో 21(3,641 మంది విద్యార్థులు), పూడూరులో 52 పాఠశాలల్లో 18 (2,960 మంది విద్యార్థులు), తాండూరులో 70 పాఠశాలల్లో 25 (7,074 మంది విద్యార్థులు), వికారాబాద్లో 72 పాఠశాలల్లో 25 (3,919 మంది విద్యార్థులు), యాలాల్లో 60 పాఠశాలలకు 21 పాఠశాలలు(4,668 మంది విద్యార్థులు)