ఆమనగల్లు, అక్టోబర్ 8: సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ పార్టీకి ఘన విజయాన్ని అందిస్తాయని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని ఆయన అన్నారు. మండల పరిధిలోని సింగంపల్లి గ్రామానికి చెందిన దాదాపు 100 కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఎంపీటీసీ దోనాదుల కుమార్, సర్పంచ్ ప్రేమలత ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జైపాల్యాదవ్ సమక్షంలో నగరంలోని ఆయన నివాసంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జైపాల్యాదవ్ మాట్లాడారు. సీఎం కేసీఆర్ పేద ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా కృషి చేస్తున్నారన్నారు. తెలంగాణ పథకాలను ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రులు ఆదర్శంగా తీసుకుంటున్నారని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అమలుకు సాధ్యం కాని హామీలను ఇస్తూ ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమైందని ఆయన దుయ్య బట్టారు.
ఆమనగల్లు మండలం అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోతుందని ఎమ్మెల్యే అన్నారు. ఇటీవలే ఆమనగల్లు మండల కేంద్రంలో 50 పడకల దవాఖానకు ఆరోగ్య శాఖ మంత్రి హరీష్రావు శంకుస్థాపన చేశారని, మండలానికి ఇటీవలే పాల్టెక్నిక్, డిగ్రీ, కళాశాలలు మంజూరయ్యాయని తెలిపారు. నియోజకవర్గంలో 1100 మందికి రెండో విడుత దళిత బంధు అందజేస్తున్నామని ఆయన తెలిపారు. గృహలక్ష్మి ద్వారా నియోజకవర్గంలో 4వేల మందికి లబ్ధి చేకూరనున్నదని, 300మంది మైనార్టీలు, ఎంబీసీలకు రూ. లక్ష పూర్తి సబ్సిడీతో అందజేసినట్లు గుర్తు చేశారు. 300 మంది ముస్లిం మహిళలకు కుట్టు మిషన్లు ఆందజేశామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్, ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ఎ.నర్సింహ, యాదయ్య, స్కైలాబ్, చంద్రమౌళి, సాయిలు, లక్ష్మయ్య, రామకృష్ణ, అరుణ్, వెంకటయ్య, రాజు, సామెలు, సత్తయ్య, యాదయ్య, రాజు, శేఖర్, యాదయ్య, శ్రీను, సాయిబాబా ఉన్నారు.