సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తున్నది. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్ రేషన్ డీలర్లకూ వరాల జల్లు కురిపించారు. ప్రస్తుతం టన్ను బియ్యానికి రూ.900 ఇస్తున్న కమీషన్ను రూ.1400లకు పెంచారు. అంతేకాకుండా 40 ఏండ్లు ఉన్న వయోపరిమితిని 50 ఏండ్లకు పెంచారు. డీలర్లకు బీమా సౌకర్యం, ఆరోగ్యశ్రీ కింద చేర్చడం వంటి పలు అంశాలపై రాష్ట్ర సర్కార్ నిర్ణయం తీసుకున్నది. దీంతో బుధవారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా రేషన్ డీలర్ల సంబురాలు అంబరాన్నంటాయి. సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేసి, ఒకరినొకరు స్వీట్లు పంచుకుని సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర పభుత్వం తీసుకున్న నిర్ణయంతో రంగారెడ్డి జిల్లాలోని 940 మంది, వికారాబాద్ జిల్లాలోని 588 మంది రేషన్ డీలర్లకు లబ్ధి చేకూరనున్నది. గతంలో టన్నుకు రూ.200 మాత్రమే కమీషన్ ఉండేదని, తెలంగాణ ప్రభుత్వం వచ్చాక కమీషన్ను 7 రెట్లు పెంచిందని రేషన్ డీలర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
– ఇబ్రహీంపట్నం, ఆగస్టు 9
బీఆర్ఎస్ ప్రభుత్వం సబ్బండ వర్గాల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నది. ఇందులోభాగంగా రేషన్ డీలర్లకు కమీషన్ పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఉమ్మడి జిల్లా అంతటా రేషన్ డీలర్లు సంబురాలు చేసుకున్నారు. రేషన్ డీలర్లకు టన్ను బియ్యానికి రూ.900 ఇస్తుండగా.. రూ.1400లకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కమీషన్ పెంపు నిర్ణయంతో సంతోషం వ్యక్తం చేసిన డీలర్లు జిల్లావ్యాప్తంగా సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డీలర్ల కమీషన్ను 7 రెట్లు పెంచడం గమనార్హం. గతంలో టన్నుకు కేవలం రూ.200 కమీషన్ మాత్రమే ఉండగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం డీలర్ల సమస్యలను గుర్తించిన సీఎం కేసీఆర్ కమీషన్ను రూ.900లకు పెంచారు. ప్రస్తుతం రూ.1400లకు పెంచుతూ నిర్ణయించారు. డీలర్లకు కూడా రూ.5 లక్షల ప్రమాద బీమాను అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా రేషన్ డీలర్లను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురానున్నారు. మరోవైపు రేషన్ డీలర్షిప్ వయోపరిమితిని 40 ఏండ్ల నుంచి 50 ఏండ్లకు పెంచుతూ నిర్ణయించింది. రాష్ట్ర పభుత్వం తీసుకున్న నిర్ణయంతో వికారాబాద్ జిల్లాలోని 588 మంది రేషన్ డీలర్లకు లబ్ధి చేకూరనుంది.
– వికారాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ)