కొడంగల్ : వారం రోజుల క్రితం అదృశ్యమైన మహిళ పొలంలో శవమై కనిపించిన సంఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. సీఐ అప్పయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని అన్నారం గ్రామానికి చెందిన కావలి లక్ష్మి(40), వారం రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు, చుట్టుప్రక్కన గ్రామాల్లో వెతికిన ఆచూకీ లభించలేదు. సోమవారం గ్రామ శివారులోని పళ్ల నారాయణరెడ్డి పొలంలోని కంది మొక్కల మధ్య ఓ మహిళ శవాన్ని పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించి సమాచారాన్ని అందించారు.
దీంతో కుటుంబ సభ్యులు ఘటన స్థలానికి చేరుకుని శవాన్ని గుర్తుపట్టినట్లు తెలిపారు. ఆమెను గుర్తు తెలియని వ్యక్తులు కొట్టి చంపినట్లు అనవాళ్లు ఉన్నాయని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతురాలి తమ్ముడు కావలి రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నమని తెలిపారు.