షాబాద్, ఏప్రిల్ 6 : గ్రామాల్లో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాలకు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారు. గురువారం రంగారెడ్డిజిల్లా వ్యాప్తంగా 80 బృందాల ద్వారా ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాల్లో 13,532 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 731 మందికి కంటి అద్దాలు పంపిణీ చేశారు. 604 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాల కోసం ఆర్డర్ చేశారు. మందులు పంపిణీ చేస్తున్నారు. వందరోజుల పాటు నిర్వహించే రెండో విడుత కంటి వెలుగును విజయవంతం చేసేందుకు అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు.
300 గ్రామాలు, 62 వార్డుల్లో కంటి వెలుగు శిబిరాలు
బొంరాస్పేట : వికారాబాద్ జిల్లాలో 5027 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 610 మందికి రీడింగ్ గ్లాసులు పంపిణీ చేయగా, 577 మందికి అద్దాలను ఆర్డరిచ్చారు. జిల్లాలో ఇప్పటివరకు 300 గ్రామాలు, 62 వార్డుల్లో కంటి వెలుగు వైద్య శిబిరాలను నిర్వహించినట్లు డీఎంహెచ్వో పాల్వన్కుమార్ తెలిపారు.