శర్వానంద్ తాజా చిత్రం ‘భోగి’ నిర్మాణ దశ నుంచే అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. తెలంగాణ నేపథ్య కథాంశంతో రూపొందుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాకు సంపత్నంది దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఇటీవలే హైదరాబాద్లో వేసిన భారీ సెట్లో 22 రోజుల పాటు ఈ సినిమా ైక్లెమాక్స్ ఘట్టాలను తెరకెక్కించారు.
ఈ యాక్షన్ ఎపిసోడ్లో 800 మందికిపైగా జూనియర్ ఆర్టిస్టులు పాల్గొన్నారని, స్టంట్ కొరియోగ్రాఫర్ దిలీప్ సుబ్బరాయన్ నేతృత్వంలో తెరకెక్కించిన పోరాట ఘట్టాలు గూజ్బంప్స్ తెప్పిస్తాయని మేకర్స్ తెలిపారు. 1960 తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని ఓ ఫిక్షనల్ విలేజ్లో జరిగే కథ ఇదని, శర్వానంద్ మునుపెన్నడూ చూడని రీతిలో రా అండ్ రస్టిక్ లుక్లో కనిపిస్తారని దర్శకుడు సంపత్నంది పేర్కొన్నారు. అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో, నిర్మాత: కె.కె.రాధామోహన్, రచన-దర్శకత్వం: సంపత్నంది.