పరిగి, జనవరి 20: కంటి వెలుగు కార్యక్రమం దేశానికే తలమానికంగా నిలుస్తున్నదని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పరిగి మండలం చిట్యాల్ గ్రామంలో కొనసాగుతున్న కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా కంటి పరీక్షలను స్వ యంగా ఎమ్మెల్యే మహేశ్రెడ్డి పరిశీలించి వైద్యులతో మాట్లాడి వివరాలు అడిగి తెలు సుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమం సద్వినియోగం చేసుకోవడం ద్వారా అంధత్వ నివారణకు అందరూ సహకరించాలన్నారు. ప్రజల ఆరో గ్యంపై బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని తెలిపారు.
ఈ సందర్భంగా గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాల కోసం డీఎంఎఫ్టీ ద్వారా రూ.ఐదులక్షలు మంజూరు చేశామని, సీసీ రోడ్లకు రూ.15లక్షలు మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అంగన్వాడీ భవనం మరమ్మతు పనులకు రూ.2లక్షలు మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో శేషగిరిశర్మ, ఎంపీవో దయానంద్, సర్పంచ్ రజిత, డాక్టర్ ప్రవీణ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బి.ప్రవీణ్కుమార్రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ ఎస్.భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
చూపు మందగించిన వారు పరీక్షలు చేయించుకోవాలి
వికారాబాద్, జనవరి 20 : కంటి చూపు మందగించిన ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ తెలి పారు. శుక్రవారం వికారాబాద్ మండల పరిధిలోని సిద్దులూర్ గ్రామంలో కొన సాగుతున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనం ద్ మాట్లాడుతూ గురువారం మొదటి రోజు 141 మందికి కంటి పరీక్షలు నిర్వ హించ గా, అందులో 102 మందికి కంటి అద్దాలు అందించామన్నారు. కార్యక్రమంలో ఎంపీవో నాగరాజు, పంచాయతీ కార్యదర్శి మధుకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
శిబిరాలను సందర్శించిన మున్సిపల్ కమిషనర్
వికారాబాద్, జనవరి 20 : వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని ఒకటో వార్డు కొత్తగడి, 24వ వార్డు శివాజీనగర్, 31వ వార్డు శివరాంనగర్ కాలనీల్లో కొనసాగుతున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని శుక్రవారం వికారాబాద్ మున్సిపల్ కమిషనర్ శరత్చంద్ర పరిశీలించారు. వైద్యులను, సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. కమిషనర్తో పాటు మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
కులకచర్ల మండలంలో..
కులకచర్ల, జనవరి 20 : కులకచర్ల మండల కేంద్రంతో పాటు అంతారం, బండవెల్కిచర్ల గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని రెండవ రోజు నిర్వహించినట్లు సీహెచ్వో, కంటి వెలుగు నోడల్ అధికారి చంద్రప్రకాశ్ తెలిపారు.శుక్రవారం మూడు కేంద్రాలను పరి శీలించినట్లు తెలిపారు. మూడు గ్రామాల్లో ప్రజలు కంటి పరీక్షలు చేయించుకోవడానికి వస్తున్నారని పరీక్షలు నిర్వహించి అవసరమున్నవారికి కంటి అద్దాలను అందిస్తున్నామని తెలిపారు కార్యక్రమంలో వైద్య సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.
సద్వినియోగం చేసుకోవాలి
పెద్దేముల్, జనవరి 20 : గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న కంటి వెలుగు శిబిరాలను నిరుపేదలు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని పెద్దేముల్ మండల వైద్యాధికారి బుచ్చిబాబు అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో కొనసాగుతున్న కంటి వెలుగు శిబిరాలను ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో డాక్టర్లు ప్రమోద్కుమార్, నవ్యశ్రీ, దీపాలి, ప్రీతమ్, పంచాయతీ కార్యదర్శులు సంధ్య, సంజు, సూపర్వైజర్ పుష్పలత, కంటి వెలుగు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.