షాబాద్, మే 18 : కంటి వెలుగు క్యాంపులకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తున్నది. ప్రజలు గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న శిబిరాలకు అధిక సంఖ్యలో తరలివచ్చి కంటి పరీక్షలు చేయించుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లాలో 80 బృందాల ద్వారా వైద్యులు ప్రజలకు కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి అప్పటికప్పుడే మందులతోపాటు అద్దాలను పంపిణీ చేస్తున్నారు.
జిల్లాలో కొనసాగుతున్న క్యాంపులను జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులతోపాటు, డివిజన్ స్థాయి వైద్యాధికారులు సందర్శించి వివరాలు తెలుసుకుంటున్నారు. జిల్లాలోని చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలో మొత్తం 80 బృందాల ద్వారా గురువారం 11,310 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. అందులో 656 మందికి కంటి అద్దాలు పంపిణీ చేశారు. 730 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాల కోసం వైద్యులు ఆర్డర్ చేశారు.
వికారాబాద్ జిల్లాలో 5,417 మందికి..
బొంరాస్పేట, మే 18 : వికారాబాద్ జిల్లాలో కం టి వెలుగు వైద్య శిబిరాలు విజయవంతంగా సాగుతున్నాయి. శిబిరాలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తున్నది. గురువారం జిల్లాలో 5,417 మందికి వైద్యులు కంటి పరీక్షలు చేశారు. అందులో 475 మందికి అద్దాలు పంపిణీ చేయగా, 357 మందికి అద్దాలను ఆర్డరిచ్చారు. ఇదిలా ఉండగా జిల్లాలో ఇప్పటి వరకు 466 గ్రామాలు, 87 వార్డు ల్లో వైద్య శిబిరాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.