హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్పై సీఎం రేవంత్రెడ్డి ఆరోపణలు చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ బుధవారం ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు.
నీట్ పేపర్ లీక్ అంశాన్ని బీఆర్ఎస్ అగ్రనేతలకు ముడిపెట్టడం దారుణమని మండిపడ్డారు. రాష్ట్రంలో గ్రూప్ 1 కుంభకోణం, నిరుద్యోగుల సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని విరుచుకుపడ్డారు.