కడ్తాల్ : సీఎంఆర్ఎఫ్ పథకం నిరుపేదలకందరికీ వరంలా మారిందని చల్లంపల్లి సర్పంచ్ కృష్ణయ్యయాదవ్ అన్నారు. మండల పరిధిలోని వంపుగూడెం గ్రామానికి చెందిన పోతుగంటి రమేశ్కి రూ. 30వేలు సీఎంఆర్ఎఫ్ చెక్కు మంజూరైంది. ఎమ్మెల్యే జైపాల్యాదవ్ సహకారంతో మంజూరైనా చెక్కును, ఆదివారం గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారుడికి స్థానిక నాయకులతో కలిసి సర్పంచ్ అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయనిధి పథకంతో నిరుపేదలకు అత్యుత్తమ వైద్య సేవలు అందుతున్నాయని తెలిపారు.
కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని సీఎం కేసీఆర్ ఆదుకుంటున్నారని, అన్ని వర్గాల సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ జైపాల్రెడ్డి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజేందర్యాదవ్, నాయకులు శివకుమార్యాదవ్, భిక్షపతి, రామకృష్ణయాదవ్, జగదీశ్, జంగయ్య, లక్ష్మయ్య పాల్గొన్నారు.