సుల్తాన్బజార్, అక్టోబర్ 7: వైద్య రంగంలో ప్రజారోగ్యాన్ని మెరుగుపర్చేందుకు డిజిటలైజేషన్ ప్రక్రియ ఎంతగానో దోహదం చేస్తుందని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ పేర్కొన్నారు. కోఠిలోని ఉస్మానియా మెడికల్ కళాశాల కమ్యూనిటీ మెడిసిన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న వర్క్షాపునకు శనివారం ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. వైద్యారోగ్య రంగంలో డిజిటలైజేషన్ ప్రక్రియతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని, దీనిని వినియోగించ డంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో ఉందన్నారు.
కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శశికళారెడ్డి మాట్లాడుతూ ప్రజారోగ్యంలో డ్రోన్ టెక్నాలజీ, నవజాత శిశువుల ఆరోగ్య పరిరక్షణ, ఆయుష్మాన్ భారత్ ఆధునిక యంత్రాల ద్వారా ఆరోగ్య పరిరక్షణ డిజిటలైజేషన్తోనే సాధ్యమవుతుందన్నారు. ఈ ప్రక్రియతో వ్యాధులను ముందే గుర్తించడం, టెలి మెడిసిన్ వంటి ఈ-సేవలను ఇప్పటికే రాష్ట్రంలో అందిస్తున్నట్లు తెలిపారు. ఈ వర్క్షాప్లో తెలంగాణ, ఆంధ్ర రాష్ర్టాల నుంచి సుమారు 400 మంది ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, పీజీ వైద్య విద్యార్థులు పాల్గొని రిసెర్చ్ పేపర్స్ ప్రజెంటేషన్ చేశారు. కార్యక్రమంలో కమ్యూనిటీ మెడిసన్ డిపార్ట్మెంట్ హెచ్వోడీ డాక్టర్ భవాని, ప్రొఫెసర్ డాక్టర్ కిరణ్మయి, అసోసియేట్ ప్రొఫెసర్లు డాక్టర్ అహ్మద్, కిరణ్మయి, ఉమారాణి, అనుపమ, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ ఆనంద్, మిషా, శ్రీలత, విజయ శ్రీ, మారుతిరెడ్డి, ఎంపీహెచ్వో వేణుగోపాల్ గౌడ్ పాల్గొన్నారు.