షాద్నగర్టౌన్, మార్చి 14 : ఇంటర్ పరీక్షలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. షాద్నగర్ పట్టణంలో ఆరు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1,859 మంది విద్యార్థులకుగాను 1,743 మంది హాజరుకాగా 116 మంది గైర్హాజరయ్యారు. అదేవిధంగా ఒకేషనల్ పరీక్షలకు 303 మంది కిగాను 277 మంది విద్యార్థులే హాజరు కాగా 26 మంది గైర్హాజరైనట్లు కస్టోడియన్లు శ్రీకాంత్, చంద్రశేఖర్ తెలిపారు.
ఇంటర్ పరీక్షలు ముగియడంతో విద్యార్థులు సంతోషంతో ఒకరికొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. అనంతరం కేంద్రాల నుంచి బాయ్ బాయ్ చెప్పుకుంటూ తమ ఇండ్లకు వెళ్లిపోయారు. కాగా ఒకేషనల్ పరీక్షలు మాత్రం శనివారం ముగుస్తాయని తెలిపారు.