పెద్దేముల్, ఫిబ్రవరి 5 : ఉపాధ్యాయులు విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంచాలని పెద్దేముల్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ అన్నారు. శనివారం వసంత పంచమిని పురస్కరించుకొని సరస్వతీ దేవి పుట్టినరోజున కార్యక్రమంతో పాటు ‘చదువు-ఆనందించు-అభివృద్ధిచెందు’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని 100 రోజుల పాటు నిర్వహించి విద్యార్థులతో గ్రంథాలయ కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషలు చదవడంలో విద్యార్థులు ఆసక్తితో పాల్గొనాలని, ఆ దిశగా ఉపాధ్యాయులు విద్యార్థులను సన్నద్ధం చేయాలని కోరారు. కార్యక్రమంలో పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ సి.రాములు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
కులకచర్ల, ఫిబ్రవరి 5 : మండల పరిధిలోని బండవెల్కిచర్ల ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు రాములు ఆధ్వర్యంలో అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. బొంరెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన వసంత పంచమి కార్యక్రమంలో ప్రధాపాధ్యాయులు నరేశ్, ఉపాధ్యాయులు సూర్య, అరుణ, పల్లవి, గ్రామస్తులు పాల్గొన్నారు.
యాలాల, ఫిబ్రవరి 5 : చదువుతోనే లక్ష్యాలను చేరుకుంటామని సర్పంచ్ సిద్రాల సులోచన అన్నారు. శనివారం అందరూ చదువుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘చదువు, ఆనందించు, అభివృద్ధిచెందు’ కార్యక్రమంలో భాగంగా యాలాల జడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాలొని మాట్లాడారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
పరిగిటౌన్, ఫిబ్రవరి 5 : వసంత పంచమి సందర్భంగా శ్రీ సరస్వతి శిశుమందిరం పాఠశాలలో శనివారం సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మల్లేశ్ మాట్లాడుతూ వసంత పంచమి రోజున అక్షరాభ్యాసం చేయిస్తే పిల్లలకు జ్ఞాపకశక్తి బాగా వస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థి పరిషత్ అధ్యక్షుడు ముకుంద నాగేశ్వర్, విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల ఆచార్యులు, మాతాజీలు పాల్గొన్నారు.
ధారూరు, ఫిబ్రవరి 5: ధారూరు మండల పరిధిలోని వివిధ పాఠశాలలో చిన్నారులతో సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. కార్యక్రమంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
వికారాబాద్, ఫిబ్రవరి 5 : పట్టణంలోని శ్రీ సరస్వతి శిశుమందిర్తో పాటు పట్టణంలోని పలు పాఠశాలల్లో అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో శ్రీ సరస్వతీ శిశుమందిర్ పాఠశాల ప్రధానాచార్యులు ఆర్.నర్సింహులు, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, అధ్యాపకులు పాల్గొన్నారు.
బొంరాస్పేట, ఫిబ్రవరి 5 : వసంత పంచమి పర్వదినాన్ని శనివారం మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఘనంగా నిర్వహించారు. బొంరాస్పేట సీపీఎస్, జీయూపీఎస్, బాపల్లితండా, కేజీబీవీ పాఠశాలల్లో సరస్వతీదేవి చిత్రపటానికి పూల మాలలు వేసి పూజా కార్యక్రమం నిర్వహించి పిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం ప్రభుత్వం అమలు చేస్తున్న చదువు-ఆనందించు-అభివృద్ధిచెందు(రీడ్) కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు ప్రారంభించారు. చెట్టుపల్లితండా కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలలో విద్యార్థినులకు కథల పుస్తకాలను అందజేశారు. కార్యక్రమంలో ఆయా పాఠశాలల హెచ్ఎంలు అనిల్కుమార్, కాశీపతి, గోపాల్, కేజీబీవీ ఎస్వో రాధిక, ఉపాధ్యాయులు లక్ష్మి, శ్రీప్రియ, సీమ, సీఆర్పీ నర్సింహులు, విద్యార్థులు పాల్గొన్నారు.
కొడంగల్, ఫిబ్రవరి 5: మండలంలోని ఐనాన్పల్లి ప్రాథమిక పాఠశాలలో వసంత పంచమి వేడుకలను నిర్వహించారు. అనంతరం చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించి పలక, బలపం, పెన్నులు, చాక్లెట్, బిస్కెట్లను అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వేణుగోపాల్తో పాటు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
మండలంలోని పాతకొడంగల్ గ్రామంలో విద్యార్థులకు వివేకానంద జీవిత చరిత్ర పుస్తకాలను అందించి రీడ్ కార్యక్రమం విశిష్ఠతను వివరించారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం క్రాంతికుమార్, ఉపాధ్యాయురాలు సంధ్యతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.
తాండూరు, ఫిబ్రవరి 5 : నియోజకవర్గంలోని పలు పాఠశాలల్లో వేదపండితుల మంత్రోచ్ఛారణలతో చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. వసంత పంచమి వేడుకల్లో పాల్గొన్న నేతలు, ఉపాధ్యాయులు మాట్లాడుతూ జ్ఞానం, వాక్కు, విద్య మొదలైన శక్తులే సరస్వతీ దేవి అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు విధిగా నిర్వహించాలన్నారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
మోమిన్పేట , ఫిబ్రవరి 5 : మండల పరిధిలోని చంద్రయాన్పల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ అంజయ్య పాల్గొని చిన్నారులతో అక్షరాలు దిద్దించారు.