ఇబ్రహీంపట్నంరూరల్ : అత్యవసర సమయాల్లో ప్రైవేటు దవాఖానల్లో చికిత్స చేయించుకునే పేదలకు సీఎం సహాయనిధి ఎంతో తోడ్పాటునందిస్తుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని కప్పాడు గ్రామానికి చెందిన చాతల శిల్పకు సీఎం సహాయనిధి కింద మంజూరైన రూ. 30వేల చెక్కును మంగళవారం క్యాంపు కార్యాలయంలో బాధితురాలి తండ్రి భిక్షపతికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందన్నారు.
ప్రతి ఒక్కరిని ఆదుకోవడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్తువెంకటరమణారెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు ఏనుగు భరత్రెడ్డి, సర్పంచ్ హంసమ్మ, ఉప సర్పంచ్లు మునీర్, నరేందర్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్రెడ్డి, జలందర్, శంకరయ్య పాల్గొన్నారు.