వికారాబాద్, మే 26 : గ్రామానికి ఆ బావి నీరే ప్రధాన ఆధారం. ప్ర స్తుతం మిషన్ భగీరథ నీటి సరఫ రాకు ఏదైనా సమస్య వచ్చి రాకపోతే… మళ్లీ ఈ బావి గ్రామస్తుల దాహార్తిని తీరుస్తుంది. ఆ బావిని ఓ ఇంటి యజమాని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇందు కు సంబంధించి గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచి మూ డు నోటీసులు అందినా పట్టించుకోకపోవడం గమనార్హం. వికారాబాద్ మండలం గొట్టిముక్కల గ్రామంలోని మైసమ్మ ఆలయం వెనుక ఉన్న పెద్ద బావికి ఎన్నో ఏండ్ల చరిత్ర ఉంది.
బావి దగ్గరలో ప్రభుత్వ భూమి (గ్రామ పంచాయతీ స్థలం)లో ఒక ఇంటి నిర్మాణం చేపడుతున్నారు. ఇంటి నిర్మాణానికి అనుమతులు ఇచ్చిన దాని కంటే ఎక్కువ స్థలంలో పనులు సాగిస్తున్నాడు. ఎన్నో ఏండ్ల నుంచి బావి వద్ద ఉన్న పైప్ లైన్లను తొలగించి నిర్మాణ పనులు జరుగుతు న్నాయి. గ్రామ పంచాయతీ కార్యదర్శి ఇప్పటికే మూడు నోటీసులు సైతం ఇచ్చారు. గ్రామానికి ప్రత్యేక అధికారిగా ఉన్న తహసీల్దార్ లక్ష్మీ నారాయణ సైతం ఈ పనులను పర్యవేక్షించి వెంటనే నిలుపుదల చేయాలని సూచించారు.
ఈ విషయమై పంచాయతీ కార్యదర్శి మధుకర్రెడ్డిని అడుగగా బావి దగ్గర అక్రమ నిర్మాణం జరుగుతున్న మాట వాస్తవమే అన్నారు. . ఏన్నో ఏండ్లుగా ఉన్న బావి పైపు కనెక్షన్లు తీసివేశారని పేర్కొన్నారు. పైపు కనెక్షన్ తొలగించి పిల్లర్ గుంతలు తీశారని, ఇప్పటికే ఆ పనులు ఆపాలని నోటీసులు ఇచ్చామన్నారు. గ్రామ ప్రత్యేకాధికారి కూడా పనులు ఆపాలని చెప్పినా వినడం లేదని తెలిపారు. పై స్థాయి అధికారుల ఆదేశాల మేరకు వేచి చూస్తున్నామని తెలిపారు.