ఇబ్రహీంపట్నం, మార్చి 8 : మహిళలు అన్ని రంగాల్లో రాణించే విధంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా కౌన్సిలర్లతో కలిసి ఆయన బుధవారం క్యాంపు కార్యాలయంలో కేక్ కట్చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం అందించే తోడ్పాటుతో మహిళలు పురుషులతో సమానంగా రాణిస్తున్నారన్నారు. మహిళలు స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం ఇచ్చే పథకాలను సద్వినియోగం చేసుకుని ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు.
అదేవిధంగా ఇబ్రహీంపట్నం మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ కప్పరి స్రవంతి ఆధ్వర్యంలో, నవ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నంలో దినోత్సవాన్ని నిర్వహించారు. మహిళా సిబ్బందిని సన్మానించారు. తెలంగాణ గ్రామీణ క్రీడాప్రాంగణం వద్ద మహిళలకు పలు రకాల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. అబ్దుల్లాపూర్మెట్ డ్వాక్రా భవనంలో సర్పంచ్ కిరణ్గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఎంపీపీ రేఖ మహిళలతో కలిసి కేక్ కట్చేశారు. గురునానక్ విద్యాసంస్థల్లో కళాశాల వైస్ చైర్మన్ గగన్దీప్సింగ్ కోహ్లీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మహిళా పారిశ్రామిక వేత్త సంజయ్, అరుణజ్యోతి తదితరులు పాల్గొన్నారు. యాచారం మండలంలోని గడ్డమల్లయ్యగూడ గ్రామంలో కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు విద్యాధరణి, శ్రీకృష్ణ, గ్రామ సర్పంచ్ జంగయ్య పాల్గొని మహిళా దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. పెద్దఅంబర్పేటలో చైర్పర్సన్ స్వప్న, తుర్కయాంజాల్ మున్సిపాలిటీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్చైర్మన్ ఆకుల యాదగిరి, కౌన్సిలర్లు మమత, శ్వేత, సుజాత, పద్మ, శ్రీలత, మహిళా నాయకురాలు మాధవి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
షాద్నగర్ : మహిళల భద్రతకు ప్రభుత్వం షీటీంలను ఏర్పాటు చేసిందని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కమ్మసేవా సమితి ఆధ్వర్యంలో షాద్నగర్ పట్టణంలోని శివమారుతి గీతా అయ్యప్ప మందిరం ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. మున్సిపాలిటీల్లో పారిశుధ్య మహిళా కార్మికుల సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. మహిళా కార్మికులను శాలువలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కె. నరేందర్, వైస్ చైర్మన్ ఎంఎస్. నటరాజన్, కమ్మసేవా సమితి నాయకులు పాతూరి వెంకట్రావు, పినపాక ప్రభాకర్, కౌన్సిలర్లు, మహిళా సంఘాల సభ్యులు, స్థానిక మహిళలు పాల్గొన్నారు.
కడ్తాల్ : మహిళా సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ఆయన మాట్లాడారు. గ్రామంలోని మహిళా సంఘం సభ్యులు, వార్డు సభ్యురాలు, ఆశ, ఏఎన్ఎంలు, పారిశుధ్య కార్మికులతో కలిసి కేక్ కట్ చేశారు.
అనంతరం మహిళలను సన్మానించి ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ లక్ష్మీనర్సింహారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలకు 50 శాతం రిజర్వేషన్ పెంచిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని పేర్కొన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా సెర్ప్, మెప్మా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.750 కోట్లు విడుదల చేసిందని తెలిపారు. అదే విధంగా మండల కేంద్రంలో మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి రూ.20 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ఆయన వివరించారు.
అదే విధంగా యువజన సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ కమ్లీమోత్యానాయక్, ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, గిరిజన సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హన్మానాయక్, ఉప సర్పంచ్ రామకృష్ణ, ఎంసీసీ మేనేజర్ రాధిక, రైతుబంధు సమితి మండల, గ్రామాధ్యక్షులు వీర య్య, నర్సింహ, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు జంగమ్మ, వా ర్డు సభ్యులు ఖైరున్నీసాబేగం, దీపిక, జంగమ్మ, ఎట్టె మ్మ, బుజ్జి, నరేందర్రెడ్డి, భిక్షపతి, మహేశ్, మల్లయ్య పాల్గొన్నారు.
ఆమనగల్లు : ఆమనగల్లు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో మండలంలోని మహిళా ప్రజాప్రతినిధులను సన్మానించారు. జడ్పీటీసీ నేనావత్ అనురాధ మాట్లాడారు. మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిలర్లు, మహిళా సిబ్బంది, మెప్మా మహిళా సిబ్బందిని సన్మానించారు. ఆమనగల్లు : ఆమనగల్లు పోలీస్ సర్కిల్ కార్యాలయంలో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుళ్లను సీఐ జాల ఉపేందర్ ఆధ్వర్యంలో సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యుడు పత్యానాయక్, మున్సిపల్ చైర్మన్ రాంపాల్, కమిషనర్ శ్యామ్సుందర్, ఎంపీటీసీ సరిత, సర్పంచ్లు సోన, కడారి మల్లమ్మ, మంజుల, కౌన్సిలర్లు రాధమ్మ, సోన, ఏఎంసీ డైరెక్టర్ రమేశ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రామకృష్ణ, ఖలీల్, చుక్క నిరంజన్, సాయిలు పాల్గొన్నారు.
కొత్తూరు : మహిళల పురోభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని కొత్తూరు మున్సిపల్ చైర్పర్సన్ బాతుల లావణ్య అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్, మహిళా కౌన్సిలర్లు, మహిళా కార్మికులను ఘనంగా సన్మానించారు. సీఎం కేసీఆర్ కృషి వల్ల తెలంగాణ రాష్ట్రంలో మహిళలు ఎంతో అభివృద్ధి చెందుతున్నారని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ డోలి రవీందర్, కౌన్సిలర్లు ్గ శ్రీనివాస్, చంద్రకళ, ప్రసన్నలత, ఎంపీటీసీ రాజేందర్గౌడ్, బీఆర్ఎస్ నాయకులు దేవేందర్యాదవ్, బ్యాగరి యాదయ్య, రవినాయక్, వెంకటేశ్, లక్ష్మణ్ పాల్గొన్నారు.
చేవెళ్లటౌన్ : చేవెళ్ల గ్రామ పంచాయతీ కార్యాలయంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. మహిళలను సర్పంచ్ శైలజ సన్మానించారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ గంగి యాదయ్య, అంగన్వాడీ టీచర్స్, ఆశ వర్కర్లు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
శంకర్పల్లి : మున్సిపాలిటీ కార్యాలయంలో మహిళా కౌన్సిలర్లు, అధికారులు, మహిళా కార్మికులను సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి, కమిషనర్ జ్ఞానేశ్వర్, కౌన్సిలర్లు శ్వేత, రాధ, లావణ్య, వాణి, లక్ష్మమ్మ, సంధ్యారాణి, నూర్జబేగం, కో ఆప్షన్ సభ్యులు రజని, ఆశ వర్కర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
మొయినాబాద్ : మండల పరిసత్ కార్యాలయ ఆవరణలోని మహిళా సమాఖ్య భవనంలో మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. డీపీఎం స్వర్ణలత హాజరై ప్రగతి సాధించిన మహిళా సంఘాలకు ఏపీఎం రవీందర్తో కలిసి బహుమతులను అందజేశారు. హిమాయత్నగర్ గ్రామంలో సర్పంచ్ మంజుల ఆధ్వర్యంలో, సురంగల్ గ్రామంలో ఆల్ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బేగరి రాజు ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. సురంగల్లో సర్పంచ్ లావణ్య మహిళలను సన్మానించారు. జేబీఐఈటీలో ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కృష్ణమాచారి, ఆర్అండ్డి డీన్ డాక్టర్ నీరజ్ ఉపాధ్యాయ,హెచ్వోడీ తావీద్ సుల్తానా, డీన్ ఐకేసీ సుమాగ్నా పట్నాయక్, ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ తిరుపతిరావు పాల్గొన్నారు.
షాద్నగర్టౌన్ : స్త్రీలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని షాద్నగర్ మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. వైస్ చైర్మన్ ఎంఎస్ నటరాజ్, మున్సిపల్ కమిషనర్ వెంకన్న, కౌన్సిలర్లతో కలిసి కేక్కట్ చేసిన అనంతరం మహిళా కౌన్సిలర్లను, మున్సిపల్ మహిళా సిబ్బందిని సన్మానించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు మహేశ్వరి, పావని, కృష్ణవేణి, లతాశ్రీ, శారద, ప్రేమలత, సరిత, విశాల, కౌసల్య, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
షాద్నగర్ రూరల్ : ఫరూఖ్నగర్ మండలలలోని విఠ్యాల గ్రామంలో సర్పంచ్ జయశ్రీతో పాటు వార్డు మెంబర్లు, పంచాయతీ సిబ్బందిని సన్మానించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, గ్రామస్తులు చంద్రశేఖర్, లింగం పాల్గొన్నారు.
షాబాద్ : మండల కేంద్రంలోని ఎస్బీఐలో మహిళా సంఘాల సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి సంబురాలు నిర్వహించారు. కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్ సరస్వతి, మహిళా సంఘాల సభ్యులు, బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.