ఇబ్రహీంపట్నంరూరల్ : ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి అండగా నిలుస్తోందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటికి చెందిన మంకాల లక్ష్మమ్మ అనే మహిళకు ప్రభుత్వం నుంచి మంజూరైన రూ. 60వేల చెక్కును మంగళవారం క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేద ప్రజలకు కొండంత అండగా నిలుస్తున్న పథకం ముఖ్యమంత్రి సహాయనిధి పథకం అని అన్నారు.
నియోజకవర్గంలో కోట్లాది రూపాయల నిధులు సీఎం సహాయనిధి కింద పేద ప్రజల వైద్యానికి అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ల సంఘం మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు నీలం శ్వేతబాలు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.