పెద్దేముల్ : మండల పరిధిలో క్లస్టర్ల వారీగా పనిచేసే మండల వ్యవసాయ విస్తరణ అధికారులు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ హద్దు మీరితే వేటు తప్పదని మండల వ్యవసాయ అధికారి ( ఏఈవో ) షేక్ నజీరొద్దీన్ హెచ్చరించారు.
శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకే వ్యవసాయ అధికారి కార్యాలయానికి తాళం వేసి ఉండడం అనే విషయంపై శనివారం దిన పత్రికలో ప్రచురితం అయింది. కథనానికి ఏఓ షేక్ నజీరొద్దీన్ స్పందిస్తూ పెద్దేముల్ క్లస్టర్ ఏఈఓ వినయ్పై క్రమశిక్షణ చర్యల్లో భాగంగా మెమో జారీ చేశారు. ఈ సందర్భంగా ఏఓ షేక్ నజీరొద్దీన్ మాట్లాడుతూ ప్రభుత్వం నియమనిబంధనల ప్రకారం.. మండల పరిధిలోని ఆయా గ్రామాల క్లస్టర్లలో పనిచేసే ఏఈఓలు తప్పనిసరిగా తమ తమ క్లస్టర్లలో ఉదయం 10నుంచి సాయంత్రం 5 గంటల వరకు రైతులకు అందుబాటులో ఉండాలన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా వ్యవహారించరాదని కాదని ఎవరైనా అలా వ్యవహారించి హద్దు మిరితే వేటు తప్పదన్నారు.