మండలంలోని దామగుండం రామలింగేశ్వరాలయ ప్రాంతంలోని అడవిలో గత ఐదురోజులుగా మంటలు చెలరేగుతున్నాయి. అటవీలో గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు అంటించడంతో భారీగా మంటలు చెలరేగుతూ.. పొగ వ్యాపిస్తున్నది. దీంతో ఆ ప్రాంతంలోని జంతువు లు, పక్షులు మృతి చెందడంతోపాటు పెద్ద, పెద్ద వృక్షా లు కాలిపోతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆయుర్వేద వనమూలికలు నాశనమవుతున్నాయని వాపోతున్నారు. నేవీ రాడార్ కేంద్ర ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతించడంతో గుర్తుతెలియని వ్యక్తులు కావాలనే ఈ అటవీలో నిప్పుపెట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అటవీశాఖ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
-పూడూరు, ఫిబ్రవరి 22