వికారాబాద్, సెప్టెంబర్ 19, (నమస్తే తెలంగాణ): ఓటరు ముసాయిదా జాబితా విడుదల చేసిన అనంతరం కొత్త ఓటరు నమోదుతోపాటు ఓటరు కార్డులో చేర్పులు, మార్పుల సవరణకుగాను ఎన్నికల సంఘం అవకాశమిచ్చింది. మంగళవారంతో కొత్త ఓటరు నమోదుకుగాను గడువు ముగియగా, ఉమ్మడి జిల్లాలో పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. వికారాబాద్ జిల్లావ్యాప్తంగా కొత్త ఓటరు నమోదుకుగాను 44,946 మంది దరఖాస్తు చేసుకోగా, రంగారెడ్డి జిల్లాలో 1,62,503 దరఖాస్తులు వచ్చాయి. వికారాబాద్ జిల్లాలో ఓటరు కార్డులో మార్పులు, చేర్పులకుగాను 76,570 దరఖాస్తులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో చిరునామా మార్పునకు 56,674 దరఖాస్తులు, ఓట్ల తొలగింపునకు 26,130 దరఖాస్తులు వచ్చాయి. ఈనెల 26 వరకు దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను ఎన్నికల సిబ్బంది పూర్తి చేయనున్నారు. అక్టోబర్ 4న తుది ఓటరు జాబితాను విడుదల చేయనున్నారు.
కొత్త ఓటరు నమోదుకు మంగళ వారంతో గడువు ముగిసింది. ఓటరు ముసాయిదా జాబితా విడుదల చేసిన అనంతరం కొత్త ఓటరు నమోదుతోపాటు ఓటరు కార్డులో మార్పులు, చేర్పులు, సవరణకు ఎన్నికల సంఘం అవకాశమిచ్చింది. జిల్లావ్యాప్తంగా కొత్త ఓటరు నమోదుతోపాటు ఓటరు కార్డులో పేరు, అడ్రస్ మార్పులు, చేర్పులకు భారీగా దరఖాస్తు చేసు కున్నారు. కొత్త ఓటరు నమోదుకు అధిక మొత్తంలో దరఖాస్తు చేసు కోవడం గమనార్హం. కొత్త ఓటరు నమోదుతోపాటు ఓటరు కార్డులో పేరు, అడ్రస్ మార్పులు, చేర్పుల కోసం జిల్లావ్యాప్తం గా ఫారం-6, 7, 8 లో భాగంగా 76,570 దరఖాస్తులురాగా, 847 దరఖాస్తులను తిరస్కరించగా, ఇప్పటివరకు 38,269 దర ఖాస్తులకు ఆమోదం తెలుపగా, మరో 37, 433 దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ పెం డింగ్లో ఉంది. ఓటరు ముసాయిదా జాబితా అనంతరం జిల్లాలో అత్యధికంగా కొత్త ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకున్నారు. జిల్లావ్యాప్తంగా కొత్త ఓటరు నమోదుకు 44,946 మంది దరఖాస్తు చేసుకోగా, అత్య ధికంగా పరిగి నియోజకవర్గంలో 12,861 దరఖాస్తులు, కొడంగల్ నియోజకవర్గంలో 12,006 , వికారాబాద్ నియోజకవర్గంలో 11,941 , తాండూరు నియోజకవర్గంలో 8042 మంది దరఖాస్తు చేసుకున్నారు.
సంబంధిత దరఖాస్తుల్లో 29,889 దరఖాస్తులకు ఆమోదం తెలపగా, మిగతా దరఖాస్తులకు సంబంధించి పరిశీలించాల్సి ఉంది. అదే విధంగా ఫారం-7 దరఖాస్తులకుగాను జిల్లా వ్యాప్తంగా 17,917 దరఖాస్తులురాగా, 1803 దరఖాస్తులకు ఆమోదం తెలుపగా, మిగతా దరఖాస్తులను పరిశీలన ప్రక్రియ పెండింగ్లో ఉంది. అదేవిధంగా ఫారం-8 కింద 13,707 దరఖాస్తులురాగా, ఇప్పటివరకు 6577 దరఖాస్తులకు ఆమోదం తెలపగా, మిగతా దరఖాస్తులను పరిశీలించాల్సి ఉంది. అయితే ఓటరు జాబితా సవ రణలో భాగంగా వచ్చిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను ఈనెల 26లోగా ఎన్నికల సిబ్బంది పూర్తి చేయనున్నారు.
4న ఓటరు తుది జాబితా…
ఓటరు తుది జాబితాను అక్టోబర్ 4న ఎన్నికల సంఘం విడుదల చేయనున్నది. కొత్త ఓటరు నమోదు కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తే జిల్లాలో ఓటర్ల సంఖ్య మరో 40 వేల వరకు పెరగనున్నది. ప్రస్తుతం జిల్లాలో 8.99 లక్షల మంది ఓటర్లు ఉండగా, 9.30 లక్షల వరకు ఓటర్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా ఓటరు ముసాయిదా జాబితా ప్రకారం జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో 8,99,395 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుషులు-4,49,871 మంది ఓటర్లు, మహిళలు-4,48,970 మంది ఓటర్లు, ఇత రులు-36 మంది, సర్వీసు ఓటరు-518 మంది ఓటర్లున్నారు. జిల్లాలో అత్యధికంగా పరిగి నియోజకవర్గంలో మొత్తం 2,40,086 మంది ఓటర్లుండగా, పురుషులు-1,22,282 మంది, మహిళలు-1,17,567 మంది, ఇతరులు-ఎనిమిది మంది, సర్వీసు ఓటర్లు-229 మంది ఉన్నారు. అదేవిధంగా వికారాబాద్ నియోజకవర్గంలో మొత్తం 2,17,551 మంది ఓటర్లుండగా పురుషులు-1,09,714 మంది, మహిళలు-1,07,757 మంది, ఇతరులు-నలుగురు, సర్వీసు ఓటర్లు-76 మంది ఉన్నారు. తాండూరు నియోజకవర్గంలో మొత్తం 2,22,177 మంది ఓటర్లుండగా పురుషులు-1,08,712 మంది, మహిళలు-1,13,407 మంది , ఇతరులు-తొమ్మిది మంది, సర్వీసు ఓటర్లు-49 మంది ఉన్నారు. కొడంగల్ నియోజకవర్గంలో మొత్తం 2,19,581 మంది ఓటర్లుండగా పురుషులు-1,09,163 మంది , మహిళలు-1,10,239 మంది , ఇతరులు-15 మంది, సర్వీసు ఓటర్లు-164 మంది ఉన్నారు. అదేవిధంగా జిల్లాలో 1133 పోలింగ్ కేంద్రాలుండగా, పరిగి నియోజకవర్గంలో 305, వికారాబాద్ నియోజకవర్గంలో 284 , తాండూరు నియోజకవర్గంలో 269 , కొడంగల్ నియోజక వర్గంలో 275 పోలింగ్ కేంద్రాలున్నాయి.
రంగారెడ్డి జిల్లాలో..
రంగారెడ్డి జిల్లాలో ఓటరు జాబితా సవరణకు పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. కొత్త ఓటు నమోదుతోపాటు సవరణలకు ఈనెల 19 చివరి తేదీకాగా..గడువు ముగిసే నాటికి 2,45,307 దరఖాస్తులు వచ్చాయి. కొత్తగా ఓటు హక్కు కోసం 1,62,503 దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి 34,298 దరఖాస్తులు అధికారులకు అందాయి. చిరునామా మార్పుకు 56,674 దరఖాస్తులు, ఓట్ల తొలగింపునకు 26,130 దరఖాస్తులు వచ్చాయి. ఈనెల 26 వరకు దరఖాస్తుల పరిశీలనను చేపట్టనున్నారు. అక్టోబర్ 4న ఓటరు తుది జాబితాను విడుదల చేయనున్నారు.