ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 3 : ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను సహించలేని ఎన్ఎస్యూ కార్యకర్తలు గూండాయిజం చేశారు. ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తాలో గురువారం జరిగిన ఘటనతో స్వల్ప ఉద్రిక్తత నెలకొన్నది. ఎమ్మెల్యే ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు తన క్యాంపు కార్యాలయం నుంచి నగరానికి కారులో వెళ్తుండగా.. అప్పటికే అక్కడ మాటువేసిన కొందరు ఎన్ఎస్యూఐ కార్యకర్తలు కారుపైకి కోడిగుడ్లతో దాడి చేశారు. దీంతో ఎమ్మెల్యే డ్రైవర్, గన్మెన్లతో పాటు టీఆర్ఎస్ నాయకులు వారిని అడ్డుకోగా అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దాడిని పరిశీలించి ఇద్దరిని అదుపులోకి తీసుకోగా.. మిగతావారు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది.