ఇబ్రహీంపట్నం, జనవరి 25 : ఓటు వజ్రాయుధం లాంటిదని, ఓటు పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంతరెడ్డి అన్నారు. గురువారం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇబ్రహీంపట్నంలో సాగర్హ్రదారిపై పోలీస్ స్టేషన్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు అంబేద్కర్ చౌరస్తా నుంచి ఎంపీడీవో కార్యాలయం వరకు విద్యార్థులు, యువతతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు రెవెన్యూ, పోలీసు అధికారులు పాల్గొన్నారు.
ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం
చేవెళ్లటౌన్ : ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు వజ్రాయుధంలాంటిదని చేవెళ్ల ఆర్డీవో సాయిరామ్ అన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా తహసీల్దార్ ఆధ్వర్యంలో చేవెళ్లలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీవో కార్యాలయం ఎదుట మానవహారం ఏర్పాటు చేసి ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వయోజనులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ రాజశేఖర్, రాజేందర్, ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దార్ రాఖేశ్, ఆర్ఐ పవన్ కళ్యాణ్, ఎలక్షన్ సీనియర్ అసిస్టెంట్ పాండు, జూనియర్ అసిస్టెంట్ మహేందర్, నర్సింహులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఓటు నమోదు చేసుకోవాలి
కడ్తాల్ : 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ విధిగా ఓటు నమోదు చేసుకోవాలని తహసీల్దార్ ముంతాజ్ అన్నారు. కడ్తాల్, తలకొండపల్లి మండల కేంద్రాలతోపాటు పరిధిలోని ఆయా గ్రామాల్లో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించారు. మండల కేంద్రంలోని హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారిపై విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ప్రధాన చౌరస్తాలో ఓటు హక్కును గుర్తు చేసేలా విద్యార్థులచే తహసీల్దార్ ప్రతిజ్ఞ చేయించారు.
షాద్నగర్టౌన్ : షాద్నగర్ మినీ స్టేడియం నుంచి పట్టణ ముఖ్యకూడలి వరకు అధికారులు ర్యాలీ నిర్వహించారు. పట్టణ ముఖ్యకూడలి వద్ద వివిధ మండలాల తహసీల్దార్లు విజయ్కుమార్, నిజాం, అయ్యప్ప, జానకి, మున్సిపల్ కమిషనర్ చీమ వెంకన్న, ఆర్ఐ సలీం, విజయలక్ష్మి, హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాస్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకుడు డాక్టర్ సామ రవీందర్రెడ్డి, అధికారులతో కలిసి మానవహారంగా ఏర్పడిన అనంతరం ఓటు హక్కుపై ప్రతిజ్ఞ చేయించారు.
యాచారం : తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో అధికారులు, సిబ్బంది ప్రతిజ్ఞ చేపట్టారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీకాంత్రెడ్డి, ఎంపీడీవో విజయలక్ష్మి, ఎంపీవో ఉమారాణి, ఉప తహసీల్దార్ కీర్తి సాగర్, ఆర్ఐ రామకృష్ణ, ఏపీవో లింగయ్య, నాయకులు పాల్గొన్నారు.
అబ్దుల్లాపూర్మెట్ : తహసీల్దార్ కార్యాలయంలో ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. నాయకులు, ప్రజలతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ రవీందర్దత్తు, డిప్యూటీ తహసీల్దార్ రామకృష్ణ, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు భిక్షపతి, నిజాముద్దీన్, కార్యదర్శి ప్రసాద్ పాల్గొన్నారు
తుర్కయంజాల్ : 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని తుర్కయాంజాల్ మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ అన్నారు. తుర్కయాంజాల్ మున్సిపల్ కార్యాలయంలో జాతీయ ఓటరు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అధికారులు, సిబ్బంది కలిసి ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నంరూరల్ : ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సక్రమంగా వినియోగించాలని ఇబ్రహీంపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రభు అన్నారు. గురువారం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఇబ్రహీంపట్నం డిగ్రీ కళాశాలలో ఘనంగా నిర్వహించారు.
మంచాల : మండల కేంద్రంలో తహసీల్దార్ కేవీవీ ప్రసాద్రావు ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో ఓటు హక్కు వినియోగంపై ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, యువకులు పాల్గొన్నారు.
ఆమనగల్లు : ప్రజాస్వామ్య దేశంలో ఓటు చాలా విలువైనదని మండల తహసీల్దార్ లలిత అన్నారు. గురువారం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఓటు ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు, విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. అనంతరం తహసీల్దార్ మాట్లాడారు. ఈ సందర్భంగా రాజీవ్గాంధీ చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్లారు. కార్యక్రమంలో మండల ఎంపీడీవో ఫారుక్హుస్సేన్, ఎస్ఐ బలరాంనాయక్, రెవెన్యూ అధికారులు, సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.