షాబాద్, ఫిబ్రవరి 27: తెలంగాణలో అర్హులైన లబ్ధిదారులందరికీ ప్రభుత్వ పథకాలు అందజేస్తామని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. మంగళవారం తెలంగాణ సచివాలయంలో ప్రతి ఇంటికీ 200 యూనిట్ల చొప్పున ఉచిత విద్యుత్, రూ.500కు గ్యాస్ సరఫరా పథకాలను ప్రారంభించిన అనంతరం రంగారెడ్డిజిల్లాలో చేవెళ్లలోని ఫరా ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ బహిరంగసభలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారెంటీల అమలుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. అర్హులకు ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్బాబు, ఉత్తమ్కుమార్రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీతక్క, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి దీపాదాస్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లా జడ్పీ చైర్పర్సన్లు పట్నం సునీతామహేందర్రెడ్డి, తీగల అనితారెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు రామ్మోహన్రెడ్డి, బుయ్యని మనోహర్రెడ్డి, వీర్లపల్లి శంకర్, కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల నియోజకవర్గ ఇన్చార్జి పామెన భీంభరత్, సీనియర్ నాయకులు హన్మంత్రావు, కెఎల్లార్, డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, ఎలుగంటి మధుసూదన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, యాదవరెడ్డి, మల్లురవి, వంశీచంద్రెడ్డి, కొండ్రు పుష్పలీల, పట్నం రినీశ్రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.