కులకచర్ల, ఏప్రిల్ 23 : గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభు త్వం కృషిచేస్తున్నదని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. శనివారం కులకచర్ల మండల పరిధిలోని సాల్వీడ్ ఉన్నత పాఠశాలలో అదనపు గదులను ప్రారంభించిన అనంతరం మ్యాజిక్ బస్ స్వచ్ఛంద సంస్థ నిర్వహించే లర్నింగ్ సెంటర్ను ఆయన ప్రా రంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనబడి కార్యక్రమం ద్వారా అన్ని పాఠశాలల్లో మౌళిక సదుపాయాలను కల్పించి విద్యార్థులకు 8వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో వచ్చే విద్యాసంవత్సరం నుంచి విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
సాల్వీడ్ ఉన్నత పాఠశాలలో అసంపూర్తిగా ఉన్న భవన నిర్మాణ పనులు ప్రారం భించాలని, దీనికి గాను నిధులను ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. మ్యాజిక్ బస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రూ. మూడు లక్ష విలువైన కంప్యూటర్ ట్యాబ్స్ను అందజేయగా ఆయన వాటిని ప్రారంభించారు. అనంతరం గ్రామంలో జరిగే వీధి నాటకానికి సంబంధించిన కరపత్రాన్ని విడుదల చేశారు. కార్యక్రమంలో ఎంపీపీస త్య హరిశ్చంద్ర, జడ్పీటీసీ రాందాస్నాయక్, గ్రామ సర్పంచ్ బాలయ్య, పీఏసీఎస్ డైరెక్టర్ కొండయ్య, మ్యాజిక్ బస్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
దోమ, ఏప్రిల్ 23: గ్రామాల్లో అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే మహేశ్రెడ్డి పేర్కొన్నారు. శనివారం దోమ మండల కేం ద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అనసూయ అధ్యక్షతన సర్వ సభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షా కాలం ప్రారంభం అవుతున్న సందర్బంగా గ్రామాల్లో అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేసి సమస్యలు లేకుండా చూడాలని సర్పంచ్లు, ఎంపీటీసీలకు సూచించారు. సమావేశంలో వివిధ అంశాలపై కూలంకషంగా చర్చించారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో మండల కేం ద్రం లో ప్రారంభమైన సూపర్ మార్కెట్ నిర్వహణపై జడ్పీటీసీ నాగిరెడ్డి వివరణ కోరగా ఏపీఎం సాయన్న సమాధాన మిచ్చారు.
సూపర్ మార్కెట్ నిర్వహణకు రూ. 8 లక్షల 50 వేలు ఖర్చు చేశామని మొదట్లో అనుభవం లేకపోవడంతో 75 వేల రూపాయల నష్టం వాటిల్లిందని, ఇప్పుడు వ్యాపారం పుంజుకొని సజావుగా నడుస్తుందన్నారు. అన్ని శాఖల అధి కారులు సర్వసభ్య సమావేశానికి హాజరయ్యే విధంగా సర్క్యులర్ జారీ చేయాలని ఎంపీపీ అనసూయ, వైస్ ఎంపీపీ మల్లేశం ఎంపీడీవోకు సూచించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు రాజిరెడ్డి, కోఆప్షన్ సభ్యుడు ఖాజా పాషా, డిప్యూటీ తహసీల్దార్ రాజేందర్రెడ్డి, ఎంపీడీవో జయరాం, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీ టీసీలు, ఆయా శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.