మంచాల డిసెంబర్ 27 : తాటి చెట్టుపై నుంచి జారిపడి ఓ గీత కార్మికుడు మృతి చెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా మంచాల మండలం లోయపల్లి గ్రామంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికులు తెలపిన వివరాల ప్రకారం..లోయపల్లి గ్రామానికి చెందిన దోసపాటి రంగయ్య గౌడ్ (56) ఉదయాన్నే ఎప్పటిలాగే కల్లు గీచేందుకు తాటి చెట్టు ఎక్కాడు.
ప్రమాదవశాత్తు నడుముకున్న మోకు జారడంతో రంగయ్య కిందపడి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న రంగయ్య కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకోని కన్నీరుమున్నీరయ్యారు. మృతిడికి భార్య, ముగ్గురు కొడుకులు ఉన్నారు.