CM KCR | పక్షపాత ధోరణి, కుట్రలు, కుతంత్రాలతో సీమాంధ్ర పాలకులు నాడు తెలంగాణ ప్రాంతాన్ని సంక్షోభంలోకి నెట్టేస్తే.. నేడు సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకమైన పథకాలతో రాష్ర్టాన్ని సంక్షేమం దిశగా నడిపిస్తున్నారు. అన్నివర్గాల అభ్యున్నతే ధ్యేయంగా పాలన సాగిస్తూ రాష్ర్టాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలుపుతున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన వందల పథకాలతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ప్రతి కుటుంబం ఏదో ఒక రూపంలో లబ్ధిపొందుతున్నది. అధికారులు పకడ్బందీగా, పారదర్శకంగా పథకాలను అమలు చేస్తూ కుల,మత,పార్టీలకతీతంగా గడపగడపకూ అందేలా చర్యలు తీసుకుంటున్నారు. అట్టడుగు వర్గమైన దళితుల తలరాత మార్చేందుకు దళితబంధు, పేదింటి ఆడబిడ్డల పెండ్లికి ఆర్థిక భరోసానిచ్చేందుకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను అమలు చేస్తున్నారు. రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ, ఉచిత కరెంట్ వంటి స్కీమ్లతో అన్నదాతలకు అండగా నిలుస్తున్నారు. దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు ‘ఆసరా’ పింఛన్లు అందిస్తూ ఆదుకుంటున్నారు. కులవృత్తులకు పూర్వ వైభవం తేవడమే లక్ష్యంగా గొల్లకురుమలకు సబ్సిడీపై గొర్రెల యూనిట్లు, మత్స్యకారులకు చేపపిల్లలను అందిస్తున్నారు. ఇలా ఎన్నో పథకాలతో ఇంటింటా సంక్షేమ వెలుగులు నింపుతున్నారు.
– ఇబ్రహీంపట్నం /షాద్నగర్, జూన్ 8
వికారాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం గత తొమ్మిదేండ్లలో సబ్బండ వర్ణాల సంక్షేమమే ధ్యేయంగా ముం దుకు సాగుతున్నది. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో వరుసగా రెండుసార్లు అధికారం చేపట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా పథకాలను అమలుచేస్తూ ప్రజల నుంచి హ ర్షాతిరేకాలను పొందుతున్నది. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే పేదల ప్రభుత్వంగా పేరు తెచ్చుకున్న ప్రభుత్వం పేదలు, నిరుపేదలను ఆదుకునేందుకు ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. ప్రధానంగా రైతు సంక్షేమం కోసం అమలుచేస్తున్న పథకాల తో దేశమంతా రాష్ట్రం వైపు చూస్తున్నది.
గత ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో వ్యవసాయానికి గంటో, రెండు గంటలో సరఫరా అయ్యే విద్యుత్తు బీఆర్ఎస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచితంగా 24 గంటల పాటు అందుతున్నది. అదేవిధంగా దళితుల అభ్యున్నతి కోసం దళితబంధు పథకాన్ని తీసుకొచ్చి వారి వృద్ధికి కృషి చేస్తున్నది. పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక సాయం అందించేందుకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను అమలుచేస్తూ పేదలకు సీ ఎం కేసీఆర్ పెద్దన్నలా అండగా ఉంటున్నారు. వృద్ధు లు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, చేనేతలు తదితర పింఛన్దారుల పింఛన్ను రెట్టింపు చేసి ఆసరాగా నిలుస్తున్నారు. కులవృత్తులకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు గొల్ల, కురుమలకు గొర్రెలు, మత్స్యకారులకు చేపలను పంపిణీ చేస్తూ ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు నిర్వహించనున్న సంక్షేమ సంబురాల్లో భాగంగా రాష్ట్ర ప్రభు త్వం ఈ తొమ్మిదేండ్లలో సబ్బండ వర్ణాల సంక్షేమానికి అమలుచేస్తున్న పథకాలపై ప్రత్యేక కథనం..
రైతు సంక్షేమానికి పెద్దపీట..
రైతు సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తున్నది.అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రైతు ప్రభుత్వంగా పేరు తెచ్చుకున్న ఈ ప్రభుత్వం ..తొమ్మిడేండ్ల పాలనలో ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నది. అధికారంలోకి వచ్చిన వెం టనే రైతులకు ఇచ్చిన మాట ప్రకారం వ్యవసాయానికి తొమ్మిది గంటలపాటు విద్యుత్తును సరఫరా చేసిన ప్రభుత్వం..రెండేండ్లలోనే విద్యుత్తు రంగంలో నవశకం ప్రారంభమైనదేలా వ్యవసాయానికి ఉచితంగా 24గంటలపాటు నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తున్నది. అదేవిధంగా రూ.లక్ష రుణమాఫీని పూర్తి చేసిన ప్రభుత్వం, మరోసారి రూ.లక్ష రుణమాఫీలో భాగంగా ఇప్పటికే రూ.50వేల వరకు పంట రుణాలను మాఫీ చేసింది. మిగతా మొత్తాన్ని కూడా మాఫీ చేయాలని నిర్ణయించింది. అదేవిధంగా రైతులు అప్పు ల్లో చిక్కుకోకుండా పంటలను సకాలంలో సాగు చేసేందుకు ఇప్పటివరకు రైతుబంధు పథకం క్రింద జిల్లాలోని రైతులకు రూ.2,622 కోట్ల సహాయాన్ని అందజేసింది. రైతు ఏదైనా కారణంతో మృతి చెందితే సం బంధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు రూ.5 లక్షల బీమాను అందజేస్తున్నది. జిల్లాలో ఇప్పటివరకు 4,2 66 మంది రైతులు మరణించగా వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ.213 కోట్లను అందజేసింది.
కులవృత్తులకు పూర్వ వైభవం..
కుల వృత్తులకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారు. గొల్ల, కురుమలు, మత్స్యకారులకు రాయితీపై గొర్రెలు, చేపల ను పంపిణీ చేస్తుండటంతో వారిలో ఆనందోత్సాహం మొదలైంది. వారి జీవితాల్లో వెలుగులు నిండుతున్నారు. ఆర్థికంగా వృద్ధిలోకి వస్తున్నారు. సబ్సిడీ గొర్రెల పం పిణీతో గొల్ల, కురుమలు ప్రతి ఏటా రూ.2 లక్షల వరకు ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. జిల్లాలో మొదటి విడుతలో 11,333 మంది లబ్ధ్దిదారులకు రూ.125 కోట్ల విలువ చేసే 2.76 లక్ష ల గొర్రెలను పంపిణీ చేయగా నాలుగేండ్లలో వారి ఆదాయం రూ.250 కోట్లకుపైగా పెరిగినట్లు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారులు వెల్లడించారు. అదేవిధంగా మత్స్యకారుల అభ్యున్నతి కోసం ఇప్పటివరకు 4.73 కోట్ల చేప పిల్లలను జిల్లాలోని పలు చెరువుల్లో వదిలారు.
త్వరలో పేదింటికి గృహలక్ష్మి..
గూడులేని ప్రతి నిరుపేద కూ సొంతింటి కలను తీర్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందు లో భాగంగానే ఇప్పటికే డబుల్ బెడ్రూం ఇండ్ల పథకాన్ని అమలు చేస్తుండగా కొత్తగా గృహలక్ష్మి పథకానికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ పథకంలో భాగంగా సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకునే స్థోమత లేని వారికి రూ.3 లక్షల చొప్పున ఆడబిడ్డల పేరిట ఆర్థిక సాయాన్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నియోజకవర్గానికి మూడు వేల మంది చొప్పు న అర్హులను గుర్తించి అందించనున్నది. అయితే జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ నియోజకవర్గాలకు సంబంధించి నియోజకవర్గానికి 3 వేల చొప్పున మొత్తం12 వేల మంది పేదలకు లబ్ధి చేకూరనుంది. ఈ పథకం క్రింద అందించే ఆర్థిక సాయాన్ని మూడు విడుతల్లో రూ.లక్ష చొప్పుల లబ్ధిదారులకు అందించనున్నది.
తొమ్మిదేండ్లలో రూ.1,120 కోట్ల ‘ఆసరా’..
సొంత వారు దూరమై..వృద్ధాప్యంలో ఆదరణ కరువైన ఎంతోమంది పండుటాకులకు సీఎం కేసీఆర్ ప్రతినెలా ఇచ్చే రూ.2,016 పింఛన్ డబ్బులే దిక్కవుతున్నాయి. దివ్యాంగులకు అందిస్తున్న రూ.3,016 వారికి అం డగా నిలుస్తున్నది. గత ఉమ్మడి ప్రభుత్వాల పాలకులు అందించిన అరకొర పింఛన్లకు స్వస్తి చెప్పి మొదటిసారి అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం కేసీఆర్ రూ.200 పింఛన్ను రూ.1000, రూ.500 పింఛన్ను రూ.1,500 పెంచారు. రెండోసారి అధికారంలోకి బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే రూ.1000 పింఛన్ను రూ. 2,016, రూ.1,500 పింఛన్ను రూ.3,016లకు పెరిగింది. అదేవిధంగా ఆసరా పింఛన్ల వయోపరిమితిని కూడా 57 ఏండ్లకు ఇచ్చిన మాట ప్రకారం తగ్గించారు. కాగా గత ఉమ్మడి ప్రభుత్వాలు పింఛన్ల నిమిత్తం నెలకు రూ.2కోట్లు ఖర్చు చేయగా బీఆర్ఎస్ ప్రభుత్వం మొదట నెలకు రూ.12 కోట్ల మేర ఖర్చు చేయగా తదనంతరం పింఛన్ డబ్బులు రెట్టింపు కావడంతోపాటు వయోపరిమితిని తగ్గించిన నేపథ్యంలో పింఛన్ల నిమిత్తం ప్రభుత్వం నెలకు రూ.26 కోట్ల మేర ఖర్చు చేస్తున్నది. తొమ్మిదేండ్లలో బీఆర్ఎస్ ప్రభు త్వం ఆసరా పింఛన్ల కోసం రూ.1,120 కోట్లు ఖర్చు చేయడం గమనార్హం.
దళితుల కుటుంబాల్లో వెలుగులు..
అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన దళితబంధు పథకంతో జిల్లాలోని దళితుల కుటుంబాల్లో వెలుగులు నిండుతున్నాయి. మొదటి విడుతలో జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో 358మంది లబ్ధిదారులను ఎంపిక చేయగా ప్రభుత్వం రూ.35.80 కోట్ల నిధులను విడుదల చేసింది. 358 యూనిట్లకు సంబంధించి గ్రౌండింగ్ ప్రక్రియనూ అధికారులు పూర్తి చేశారు. రక్షణనిధి కింద ఇప్పటివరకు రూ.35.80 లక్షల నిధులను జమ చేశారు.
పేదింటి ఆడబిడ్డల వివాహాలకు..
ఆడబిడ్డల వివాహాలు పేద కుటుంబాలకు భారం కావొద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను అమలు చేస్తూ రూ.లక్షా116 అందిస్తున్నది. తొలుత పేద కుటుంబాలకు చెందిన ఆడపిల్లల వివాహాలకు రూ.51 వేల ఆర్థిక సాయాన్ని అందించిన ప్రభుత్వం…తర్వాత రూ.75,116 పెంచింది. అన్ని ధరలు పెరిగిన దృష్ట్యా ప్రస్తుతం పేదింటి ఆడబిడ్డలకిచ్చే సాయాన్ని రూ.లక్షా116లకు పెంచి అందజేస్తున్నది. గత తొమ్మిదేండ్లలో ప్రభుత్వం రూ.320 కోట్ల ఆర్థిక సహాయం అందజేసింది. అదేవిధంగా అంగన్వాడీ కార్యకర్తల కష్టాలనూ ప్రభుత్వం తీర్చింది. జిల్లాలో 2,524 అంగన్వాడీ కేంద్రాలుండగా 2,447 కార్యకర్తలు, సహా కార్యకర్తలు పనిచేస్తున్నారు. అంగన్వాడీలకు గతంలో ఉన్న రూ.4,500 వేతనాన్ని రూ.7,000, అంగన్వాడీ సహా కార్యకర్తల వేతనాన్ని రూ.2,200 నుంచి రూ.4,500 పెంచిన బీఆర్ఎస్ ప్రభుత్వం తదనంతరం అంగన్వాడీ టీచర్ల వేతనాన్ని రూ.13,650, కార్యకర్తలకు రూ.7,800 పెంచింది.