ధారూరు, ఫిబ్రవరి 12 : వికారాబాద్ నియోజకవర్గం పరిధిలోని వికారాబాద్ మండల పరిధిలోని జైదుపల్లి, గోధుమగూడ, సర్పన్పల్లి, రాళ్లచిటెంపల్లి గ్రామాలను వికారాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలోకి మార్చాలని శనివారం అసెంబ్లీ సమావేశంలో వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ గ్రామాలు ధారూరు పోలీస్స్టేషన్ పరిధిలో ఉన్నాయని తెలిపారు.
నూతనంగా వికారాబాద్ జిల్లా ఏర్పడటంతో ఒకటే పోలీస్స్టేషన్ ఉండడంతో ప్రజలకు ఇబ్బందికరంగా ఉందని, వికారాబాద్ మండలానికి, పట్టణానికి వేర్వేరుగా పోలీస్స్టేషన్లను ఏర్పాటు చేయాలని తెలిపారు. పాత పోలీస్ స్టేషన్ శిథిలావస్థకు చేరుకోవడంతో దాన్ని కూల్చివేసి, నూతన భవనాన్ని ఏర్పాటు చేయాలని, ధారూరు సర్కిల్ ఇన్సెక్టర్ రెసిడెన్సీ భవనం వీలైనంత త్వరగా పూర్తిచేయాలని కోరారు.