ఆమనగల్లు, ఏప్రిల్ 29 : బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ గెలుపు ఖాయమని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండల కేంద్రంలో సోమవారం రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్రెడ్డితో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉన్నత విద్యావంతుడైన ఆర్ ఎస్ ప్రవీణ్కు మార్ గురుకులాల కార్యదర్శిగా వేల మంది జీవితాల్లో వెలుగులు నింపి ఉన్నత స్థాయి ఉద్యోగాలుగా తీర్చిదిద్దారని ..
అలాంటి వ్యక్తిని గెలిపిస్తే అన్ని వర్గాల వారికి మేలు జరుగు తుందన్నారు. అలవి కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టాలని బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలకు పిలు పునిచ్చారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ర్టాభివృద్ధికి కృషి చేయలేదని ఆరోపిం చారు. కులం, మతం పేరుతో రాజకీయాలు చేస్తున్న ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలన్నారు. అనంతరం బీఆర్ఎస్ ప్రచార వాహనాలను వారు ప్రారంభించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు..
షాద్నగర్ : అమలుకు నోచుకోని హామీలతో ప్రజలను మో సం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని బీఆర్ఎస్ నాయకులు తీవ్రస్థాయిలో విమర్శించారు. సోమవారం కేశంపేట, కొందుర్గు, చౌదరిగూడ మండలాల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డికి మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు.
ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలు గడువక ముందే రాష్ట్రంలో కరువు తాండవిస్తున్నదని, కనీసం రైతుల సమస్యలను పట్టించుకునే నాథుడే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. స్త్రీలకు ఉచిత బస్సు మినహా ఏ ఒక్క గ్యారెంటీ కూడా అమలు చేయలేని స్థితిలో కాంగ్రెస్ ఉందని, రైతు రుణమాఫీపై సీఎం రేవంత్రెడ్డి పూటకో మాట మాట్లాడుతున్నారని ఆరోపించారు. కేవలం మాజీ సీఎం కేసీఆర్పై ఆరోపణలు చేయడం తప్పా రాష్ర్టా భివృద్ధికి అవసరమైన పనులపై ప్రస్తుత సీఎంకు ధ్యాసే లేదన్నారు. హామీలను కప్పిపుచ్చేందుకే యత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు అందిన సంక్షేమాన్ని వివరిస్తూ బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలనే విషయాన్ని ఓటర్లకు ప్రతి కార్యకర్త చెప్పాలని సూచించారు. ఎన్నికలు ముగిసేవరకు ప్రతి కార్యకర్త ఓ సైనికుడిలా పనిచేసి బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపునకు పాటుపడాలన్నారు. కేశంపేట మండలంలో ఎంపీపీ వై.రవీందర్యాదవ్ ఆధ్వర్యంలో కాకునూరు గ్రామంలో సమావేశాన్ని ఏర్పాటు చేసిన అనంతరం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. చౌదరిగూడ మండలం తుమ్మలపల్లి, లచ్చంపేట గ్రామాల్లో బీఆర్ఎస్ యువ నాయకుడు మురళీకృష్ణయాదవ్ ఆధ్వర్యంలో మండల, గ్రామాల బీఆర్ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారం చేశారు.
కొందుర్గు మండలం ఆగిర్యాల గ్రామంలో వైస్ ఎంపీపీ రాజేశ్పటేల్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీధర్రెడ్డి, రామకృష్ణల ఆధ్వర్యంలో గ్రామ, మండల నాయకులు మన్నె శ్రీనివాస్రెడ్డికి మద్దతుగా ప్రచారం చేశారు. ఆయా కార్యక్రమాల్లో బీఆర్ఎస్ నాయకులు మల్లేశ్, మురళీధర్రెడ్డి, జగదీశ్వర్, శ్రీశైలం, రామకృష్ణ ఆధ్వర్యంలో నాయకులు ఆకుల మానయ్య, అబ్దుల్కలామ్, కుర్వ శ్రీను, నాగం కృష్ణ, గుడెం భీమయ్య, రమేశ్, రాజు, శ్రీనివాసులు, బాబురావు, రాంచంద్రయ్య, నర్సింహులు, గ్రామాల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
చేవెళ్ల రూరల్ : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సోమవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేవెళ్ల మండల పరిధిలోని గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మండల పరిధిలోని చన్వెల్లి, ఇక్కారెడ్డి గూడ గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ.. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ చేవెళ్ల బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ను అత్యధిక మెజార్టీలో గెలిపించాలని కోరారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మాజీ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బంధు, రైతు బీమా, పేదింటి ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ తదితర ప్రజా సంక్షేమ పథకాలు ప్రస్తుత కాంగ్రెస్ ఫ్రభుత్వం అమలు చేయడం లేదని ప్రజలకు వివరించారు.
కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మర్ పట్లోళ్ల కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పెద్దొళ్ల ప్రభాకర్, బీఆర్ఎస్ నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు, నాయకులు వంగ శ్రీధర్రెడ్డి, బీఆర్ఎస్ బీసీ సెల్ మండల అధ్యక్షుడు ఎదిరె రాములు, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శివనీలచింటూ, వ్యసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ నర్సింహులు, బీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు తోట శేఖర్, కురుమ సంఘం మండల అధ్యక్షుడు కసిరె వెంకటేశ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నర్సింహులు పాల్గొన్నారు.