శంకర్పల్లి, జూలై 14 : నూతనంగా ఏర్పడిన శంకర్పల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వం రూ.25 కోట్లు మంజూ రు చేయడం అభినందనీయమని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శుక్రవారం ప్రగతిభవన్లో ఐటీశాఖ మంత్రి కేటీఆర్.. మంత్రి సబితారెడ్డి, ఎంపీ రంజిత్రెడ్డి సమక్షంలో ఎమ్మెల్యే యాదయ్యకు నిధుల మంజూరు పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యాద య్య మాట్లాడుతూ గతంలోనే శంకర్పల్లి మున్సిపాలిటీకి ప్రభుత్వం రూ. 30 కోట్లు మంజూరు చేసిందన్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాలకు ప్రత్యేక నిధులను కేటాయించడం సంతోషంగా ఉందన్నారు.
శంకర్పల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి రూ. 25 కోట్లు మంజూరు చేసినందుకు మంత్రులు కేటీఆర్, సబితారెడ్డి, ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే యాదయ్యకు మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మీప్రవీణ్కుమార్ ప్రత్యేక ధన్యావాదాలు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ప్రవీణ్కుమార్, గోపాల్రెడ్డి పాల్గొన్నారు.
పరిగి, జూలై 14: పరిగి పట్టణాభివృద్ధికి ప్రభుత్వం రూ.25 కోట్లు మంజూరు చేసింది. శుక్రవారం ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నిధుల మంజూరుకు సంబంధించిన జీవో కాపీని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డికి అందజేశారు. కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి పాల్గొన్నారు. పరిగి పట్టణాభివృద్ధికి నిధులు మంజూరు చేసినందుకు ఎమ్మెల్యే హర్షం వ్యక్తం
చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్కు సహకరించిన మంత్రి సబితారెడ్డి, ఎంపీ రంజిత్రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు.
వికారాబాద్, జూలై 14 : వికారాబాద్ మున్సిపల్ అభివృద్ధికి రూ.60 కోట్ల నిధులను మంజూరు చేస్తూ మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్కు శుక్రవారం ప్రొసీడింగ్ కాపీని అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్కు సహకరించిన మంత్రి సబితారెడ్డి, ఎంపీ రంజిత్రెడ్డిలకు ఎమ్మెల్యే ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.